ప్రధాన మంత్రి కార్యాలయం

దానశీలి మరియు కరుణామయి అయిన బిల్ కిస్ ఎధీ గారి మృతి కి సంతాపం తెలిపినప్రధాన మంత్రి

Posted On: 16 APR 2022 6:40PM by PIB Hyderabad

దానశీలి మరియు కరుణామయి అయిన బిల్ కిస్ ఎధీ గారి మృతి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మానవతావాది కార్యాల పట్ల ఆవిడ జీవన పర్యంతం ప్రదర్శించినటువంటి సమర్పణ భావం ప్రపంచం అంతటా గల ప్రజల జీవనాన్ని ప్రభావితం చేసింది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘బిల్ కిస్ ఎధీ గారి కన్నుమూత సందర్భం లో ఇదే నా ప్రగాఢమైన సంతాపం. మానవతావాది కార్యాల పట్ల ఆవిడ జీవన పర్యంతం ప్రదర్శించినటువంటి సమర్పణ భావం ప్రపంచవ్యాప్తం గా ప్రజానీకం జీవనాన్ని ప్రభావితం చేసింది. భారతదేశం లో కూడాను ప్రజలు ఆమె ను ఆప్యాయం గా స్మరించుకొంటారు. ఈశ్వరుడు ఆవిడ ఆత్మ కు శాంతి ని ప్రసాదించుగాక.’’ అని పేర్కొన్నారు.

 

 



(Release ID: 1817763) Visitor Counter : 161