మంత్రిమండలి
azadi ka amrit mahotsav g20-india-2023

వికేంద్రీకరించిన దేశీయ వ్యర్థ జలాల నిర్వహణ రంగం లో భారతదేశంమరియు జపాన్ ల మధ్య ఒక మెమోరాండమ్ ఆఫ్ కోఆపరేశన్ (ఎమ్ఒసి) పై సంతకాల కు ఆమోదంతెలిపిన మంత్రిమండలి 

Posted On: 13 APR 2022 3:29PM by PIB Hyderabad

వికేంద్రీకరించిన దేశీయ వ్యర్థ జలాల నిర్వహణ రంగం లో జల వనరులు, నదుల అభివృద్ధి మరియు గంగ సంరక్షణ విభాగం (డిఒడబ్ల్యుఆర్, ఆర్ డి ఎండ్ జిఆర్), జలశక్తి మంత్రిత్వ శాఖ మరియు జపాన్ కు చెందిన పర్యావరణ మంత్రిత్వ శాఖ ల మధ్య సంతకాలు జరిగిన ఒక సహకార ప్రధానమైన ఒప్పంద పత్రాని (ఎమ్ఒసి) కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ రోజు న ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.

అమలు కు సంబంధించిన వ్యూహం మరియు లక్ష్యాలు:

ఒక నిర్వహణ మండలి (ఎమ్ సి) ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ మండలి సహకారాని కి సంబంధించిన విస్తృతమైనటువంటి కార్యకలాపాల ను నిర్ధారించి, ఆ యొక్క కార్యకలాపాల పురోగతి ని పర్యవేక్షించడం ద్వారా ఎంఒసి ని అమలు పరచే బాధ్యత ను తీసుకొంటుంది.

ముఖ్య ప్రభావం:

ఎమ్ఒసి మాధ్యమం ద్వారా వికేంద్రీకరించిన దేశీయ వ్యర్థ జల నిర్వహణ మరియు జోహ్ కాసౌ సాంకేతిక పరి జ్ఞ‌ానాన్ని ఉపయోగించి శుద్ధి చేసిన వ్యర్థ జలాల ను తగు విధం గా తిరిగి ఉపయోగించడం వంటి రంగాల లో జపాన్ తో కలసి ఏర్పరచుకొనే సమన్వయం అనేది గొప్ప ఉపయోగకరం గా నిరూపణ కాగలదు. వ్యర్థ జలాల నిర్వహణ దిశ లో ఈ వికేంద్రీకరించిన జోహ్ కాసౌ సాంకేతికత జల్ జీవన్ మిశన్ అమలు లో భాగం అయ్యే బస్తీల నుండి వెలువడే అపరిశుద్ధ జలాల/ మురికి నీటి యొక్క నిర్వహణ తో పాటు గా ఈ మిశన్ లో భాగం గా తాజా నీటి వనరుల నిరంతరత కు పూచీ పడడానికి, అలాగే నమామి గంగే కార్యక్రమం లో భాగం గా తలెత్తే ఇదే విధమైన స్థితుల విషయం లో సైతం గొప్ప ప్రభావకారి కాగలదు. జపాన్ తో సహకారానికి సంబంధించిన ఈ ముందడుగు అనేది వ్యర్థ జలాల ను శుద్ధి చేసేందుకు సంబంధించిన జటిల సమస్య ను ఎదుర్కోవడాని కి మెరుగైన పథకాన్ని రచించడం లో పట్టణ స్థానిక సంస్థ (యుఎల్ బి) లకు సాయపడగలదు.

వ్యయం ఎంతంటే:

ఈ ఎమ్ఒసి లో భాగం గా ఉభయ పక్షాల పై ఎటువంటి ఆర్థిక పరమైన బాధ్యత ఉండబోదు. ఈ ఎమ్ఒసి లో భాగం గా వివిధ కార్యకలాపాల కు మార్గాన్ని సుగమం చేయడం కోసం అంశాల వారీ నిర్దిష్ట కార్యక్రమం లో ఇతర విషయాలకు తోడు గా సంబంధిత రంగాల తో ముడిపడ్డ సమగ్రమైన ప్రాజెక్టు రిపోర్టు లు, ఇంకా ఇతర ప్రాసంగిక అంశాలు.. ఉదాహరణ కు అవసరం అయిన పక్షం లో ఈ కోవ కు చెందిన అంశాల వారీ నిర్దిష్ట కార్యక్రమం మరియు ప్రాజెక్టు ల తాలూకు ఆర్థిక వ్యవస్థ ను కవర్ చేస్తూ ప్రి- ఫీజిబులిటీ రిపోర్టు లు, సాధ్యాసాధ్యాల నివేదిక లు మరియు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ల వంటి విస్తృత దస్తావేజుల ను తయారు చేసేందుకు ఆస్కారం ఉంటుంది.

అంశం వారీ వివరణ:

వికేంద్రీకరించిన దేశీయ వ్యర్థ జలాల నిర్వహణ రంగం లో జల వనరులు, నదుల అభివృద్ధి మరియు గంగ సంరక్షణ విభాగం (డిఒడబ్ల్యుఆర్, ఆర్&డి జిఆర్), జల శక్తి మంత్రిత్వ శాఖ (ఎమ్ఒజెఎస్) మరియు జపాన్ కు చెందిన పర్యావరణ మంత్రిత్వ శాఖ ల మధ్య మెమోరాండమ్ ఆఫ్ కోఆపరేశన్ (ఎమ్ఒసి) పై 2022వ సంవత్సరం మార్చి నెల 19వ తేదీ నాడు సంతకాలు అయ్యాయి. రెండు దేశాల మధ్య సమానత్వం మరియు పరస్పర లాభం అనే సిద్ధాంతాల ఆధారం గా సార్వజనిక జల క్షేత్రాల లో నీటి కి సంబంధించిన పర్యావరణాన్ని పరిరక్షించడం మరియు సార్వజనిక ఆరోగ్యం లో మెరుగుదల కై కృషి చేయాలన్న ఉద్దేశ్యాల తో వికేంద్రీకృత‌ దేశీయ వ్యర్థ జల నిర్వహణ సంబంధి రంగం లో సహకారాన్ని పెంపొందింప చేసుకొనేందుకు ఈ ఎమ్ఒసి పై సంతకాలు చేయడం జరిగింది.

వికేంద్రీకృత‌ దేశీయ వ్యర్థ జల నిర్వహణ సంబంధి సామర్థ్యాన్ని పెంపొందించడం, దానికి మార్గాన్ని సుగమం చేయడం మరియు అభివృద్ధిపరచడం అనే ఉద్దేశ్యాల తో భారతదేశ గణతంత్రానికి చెందిన జల వనరులు, నదుల అభివృద్ధి మరియు గంగ సంరక్షణ విభాగం (డిఒడబ్ల్యుఆర్, ఆర్&డి జిఆర్), జల శక్తి మంత్రిత్వ శాఖ (ఎమ్ఒజెఎస్) మరియు జపాన్ కు చెందిన పర్యావరణ మంత్రిత్వ శాఖ ల మధ్య మెమోరాండమ్ ఆఫ్ కోఆపరేశన్ (ఎమ్ఒసి) పై సంతకాలయ్యాయి. సహకారం తాలూకు పరిధి అనేది చాలా వరకు వికేంద్రీకరించిన దేశీయ వ్యర్థ జల నిర్వహణ మరియు శుద్ధి చేసిన వ్యర్థ జలాన్ని ప్రభావవంతమైనటువంటి రీతి లో తిరిగి వినియోగించడం అనే అంశాల పై కేంద్రీకృతం అయింది. ఈ ఎమ్ఒసి లో భాగం గా సహకారానికి సంబంధించిన విభిన్న స్వారూపాలు పరస్పర సహకారం- దీనిలో చర్చా సభ లు, సమావేశాలు మరియు సామర్ధ్య నిర్మాణం అనే మాధ్యమాల ద్వారా వికేంద్రీకరించిన దేశీయ వ్యర్థ జల నిర్వహణ సంబంధిత సమాచారాన్ని, ప్రావీణ్యాన్ని ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది- అయితే పరస్పర హితం తో కూడిన రంగాలకే ఇది పరిమితం గా ఉండదు, సహకారాన్ని ప్రోత్సహించడం, ఇంకా దానిని సుగమం చేయడం జరుగుతుంది.

ఈ ఎమ్ఒసి లో భాగం గా వేరు వేరు కార్యకలాపాల ను సౌకర్యవంతం గా తీర్చిదిద్దడం కోసం అంశాల వారీ గా ఇతర వ్యవహారాల కు తోడు సంబంధిత రంగాలతో ముడిపడ్డ సమగ్రమైన ప్రాజెక్టు రిపోర్టు లు, ఇంకా ఇతర ప్రాసంగిక అంశాలు.. ఉదాహరణ కు అవసరం అయిన పక్షం లో ఈ కోవ కు చెందిన అంశాల వారీ నిర్దిష్ట కార్యక్రమం మరియు ప్రాజెక్టు ల తాలూకు ఆర్థిక వ్యవస్థ ను కవర్ చేస్తూ ప్రి- ఫీజిబులిటీ రిపోర్టు లు, సాధ్యాసాధ్యాల నివేదిక లు మరియు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ల వంటి విస్తృత దస్తావేజుల ను తయారు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఉభయ పక్షాలు ఒక మేనేజ్ మెంట్ కౌన్సిల్ (ఎమ్ సి)ని ఏర్పాటు చేస్తాయి. ఈ ఎమ్ఒసి సహకారాని కి సంబంధించిన సమగ్ర కార్యకలాపాల ను నిర్ధారించి, ఆయా కార్యకలాపాల ప్రగతి ని పర్యవేక్షించే మాధ్యమం ద్వారా ఈ సహకార ప్రధాన ఒప్పంద పత్రాన్ని అమలుపరచే బాధ్యత ను తీసుకొంటుంది.

పూర్వరంగం:

విధానపరమైన మరియు సాంకేతిక ప్రావీణ్యాన్ని పంచుకోవడం, ట్రైనింగ్ కోర్సుల ను, కార్యశాల (వర్క్ శాప్) ల ను, విజ్ఞాన శాస్త్ర సంబంధమైన మరియు సాంకేతిక విజ్ఞాన సంబంధమైన చర్చాగోష్ఠుల ను నిర్వహించడం, నిపుణుల ను ఆయా దేశాల కు పంపించడం/ఆయా దేశాల నుంచి అటువంటి వారిని మన దేశాని కి రప్పించుకోవడం, ఇంకా అధ్యయన యాత్రలు వంటి చొరవ ల ద్వారా జల వనరుల అభివృద్ధి మరియు జల వనరుల నిర్వహణ రంగం లో ఇతర దేశాల తో కలసి ద్వైపాక్షిక సహకారాన్ని పెంపు చేసుకోవాలి అని జలవనరులు, నదుల అభివృద్ధి మరియు గంగ నది సంరక్షణ మంత్రిత్వ శాఖ సంకల్పించింది. భారతదేశం మరియు జపాన్ ల మధ్య వర్గమానం లో కొనసాగుతున్న సహకారాన్ని దృష్టి లో పెట్టుకొని, వికేంద్రీకృత శుద్ధి తో సంబంధం గల అనుభవాలను మరియు ప్రావీణ్యాన్ని ఇచ్చి పుచ్చుకోవాలనే ఉద్దేశ్యం తో జపాన్ తో ఒక ఒప్పందాని కి రావాలి అనేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.

 

 

***



(Release ID: 1816509) Visitor Counter : 231