ప్రధాన మంత్రి కార్యాలయం

హైదరాబాద్లోని బోయిగూడ లో జరిగిన అగ్ని దుర్ఘటన కారణం గా ప్రాణ నష్టం సంభవించినందుకు సంతాపంతెలిపిన ప్రధాన మంత్రి; బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ఇచ్చేందుకు ప్రధానమంత్రి ఆమోదం తెలిపారు

Posted On: 23 MAR 2022 11:30AM by PIB Hyderabad

హైదరాబాద్ లోని బోయిగూడ లో జరిగిన అగ్ని దుర్ఘటన కారణం గా ప్రాణ నష్టం సంభవించినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

 

మృతులు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్- గ్రేషియా గా మృతుల దగ్గరి సంబంధికులకు ఇచ్చేందుకు కూడా ప్రధాన మంత్రి ఆమోదం తెలిపారు.

ప్రధాన మంత్రి కార్యాలయం అనేక ట్వీట్ లలో -

 

‘‘హైదరాబాద్‌లోని భోయిగూడ లో జరిగిన ఒక అగ్ని దుర్ఘటన లో ప్రాణ నష్టం సంభవించడం నన్ను బాధపెట్టింది. ఈ దుఃఖ ఘడియ లో ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాలకు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల వంతున ఎక్స్-గ్రేషియా ను మరణించిన వారి దగ్గరి సంబంధికులకు ఇవ్వడం జరుగుతుంది: PM @narendramodi’’ అని తెలియజేసింది.

***

DS/ST

 

 



(Release ID: 1808541) Visitor Counter : 143