రైల్వే మంత్రిత్వ శాఖ

రైళ్లలో దుస్తులు, దుప్పట్లు మరియు తెర‌ల స‌రఫ‌రాపై ఉన్న ఆంక్షలను వెంటనే ఉపసంహరించుకున్న రైల్వే

Posted On: 10 MAR 2022 4:45PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారి  వ్యాప్తి నేప‌థ్యంలో కోవిడ్ ప్రోటోకాల్ దృష్ట్యా రైళ్లలో ప్రయాణీకుల తరలింపు కోసం ప్రామాణిక నిర్వ‌హ‌ణ ప్రోటోకాల్ (ఎస్ఓపీ) జారీ చేయబడింది, ఇది రైళ్ల  లోపల దుస్తులు, దుప్పట్లు మరియు తెర‌ల వాడ‌కంపై పరిమితిని విధించింది.
రైళ్ల‌ లోపల దుస్తులు, దుప్పట్లు, తెర‌ల‌  సరఫరాకు సంబంధించి పైన పేర్కొన్న పరిమితిని వెంటనే వెన‌క్కి తీసుకోవ‌డాన్ని అమలు చేయాల‌లని రైల్వేలు నిర్ణయించాయి. దీంతో కోవిడ్‌కు ముందు ఎలా దుస్తులు, దుప్పట్లు, తెర‌ల స‌రఫ‌రా చేశారో అలాగా  వర్తించే విధంగా వెసులుబాటు క‌లుగుతుంది.

 

***



(Release ID: 1804887) Visitor Counter : 169