ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహిళల అంతర్జాతీయ దినం సందర్భం లో కచ్ఛ్ లో నిర్వహించే చర్చా సభ నుఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి


సమాజం లో మహిళా సాధువుల పాత్ర ను, మహిళల సాధికారిత కల్పన దిశ లో మహిళాసాధువుల తోడ్పాటు ను గుర్తించడం కోసం ఈ సెమినార్ ను నిర్వహించడం జరుగుతోంది

Posted On: 07 MAR 2022 3:25PM by PIB Hyderabad

మహిళ ల అంతర్జాతీయ దినం సందర్భం లో కచ్ఛ్ లోని ధోర్ డో లో ఏర్పాటైన ఒక చర్చా సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయంత్రం 6 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. సమాజం మహిళా సాధువుల పాత్ర ను మరియు మహిళల సశక్తీకరణ దిశ లో వారు అందిస్తున్న తోడ్పాటు ను గుర్తించడం కోసం ఈ సెమినార్ ను ఏర్పాటు చేయడం జరుగుతోంది. 500కు పైగా మహిళా సాధువులు ఈ సెమినార్ కు హాజరు కానున్నారు.

 

ఈ చర్చా సభ లో భాగం గా సంస్కృతి, మతం, మహిళల అభ్యున్నతి, భద్రత, సమాజం లో మహిళ ల స్థాయి మరియు భారతదేశ సంస్కృతి లో భూమిక లపై సదస్సు లు ఉంటాయి. మహిళల కు ప్రయోజనకరం గా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలతో పాటు మహిళ ల కార్యసాధనలపైన కూడా చర్చించడం జరుగుతుంది.

 

కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ గారు, సహాయ మంత్రులు సాధ్వి నిరంజన్ జ్యోతి గారు, డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ గారు లు కూడా ఈ సెమినార్ లో పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమం లో సాధ్వి రుతంబర, మహా మండలేశ్వర్ కనకేశ్వరి దేవి తదితర ప్రముఖులు పాల్గొంటారు.

 

***


(Release ID: 1803653) Visitor Counter : 178