ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్-మధ్య ఆసియా సదస్సు మొదటి సమావేశంలో ప్రధానమంత్రి ప్రారంభ వ్యాఖ్యలు
प्रविष्टि तिथि:
27 JAN 2022 6:31PM by PIB Hyderabad
గౌరవనీయులారా,
భారత్-మధ్య ఆసియా శిఖరాగ్ర సదస్సు మొదటి సమావేశానికి స్వాగతం.
భారతదేశం మరియు మధ్య ఆసియా 30 సంవత్సరాల సుదీర్ఘ దౌత్య సంబంధాలను పూర్తి చేశాయి.
గత మూడు దశాబ్దాలుగా, సహకారం ద్వారా మనం అనేక రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించాము.
మరియు ఇప్పుడు , ఈ క్లిష్ట సమయంలో, మనం భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మక దృష్టిని ఏర్పరచుకోవాలి.
మారుతున్న ప్రపంచంలో మన ప్రజల, ప్రత్యేకించి యువ తరం ఆకాంక్షలను నెరవేర్చగల దృక్పథం కావాలి.
గౌరవనీయులారా,
ద్వైపాక్షిక స్థాయిలో, భారతదేశం దాని అన్ని ఆసియా దేశాలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది.
గౌరవనీయులారా,
కజకిస్థాన్ దాని ఇంధన భద్రత కోసం భారతదేశానికి ముఖ్యమైన భాగస్వామిగా మారింది. కజకిస్థాన్లో ఇటీవల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
ఉజ్బెకిస్తాన్తో భారతదేశం యొక్క పెరుగుతున్న సహకారంలో మన రాష్ట్రాలు కూడా క్రియాశీల భాగస్వాములు . ఇందులో నా గుజరాత్ రాష్ట్రం కూడా ఉంది.
మేము విద్య మరియు ఉన్నత అక్షాంశ పరిశోధన రంగంలో కిర్గిజ్స్థాన్తో క్రియాశీల భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాము. చాలా మంది భారతీయ విద్యార్థులు అక్కడ పరిశోధనలు చేస్తున్నారు.
తజికిస్థాన్తో మాకు సుదీర్ఘ రక్షణ సంబంధాలు ఉన్నాయి. మరియు మేము ఆ సంబంధాన్ని నిరంతరం బలోపేతం చేస్తున్నాము.
ప్రాంతీయ రవాణా రంగంలో , తుర్క్మెనిస్తాన్తో భారతదేశానికి ముఖ్యమైన సంబంధాలు ఉన్నాయి మరియు అష్గాబాత్ ఒప్పందంలో మన భాగస్వామ్యం స్పష్టంగా ఉంది.
గౌరవనీయులారా,
ప్రాంతీయ భద్రతకు సంబంధించి మనందరికీ ఒకే విధమైన ఆందోళనలు మరియు లక్ష్యాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్లో జరుగుతున్న పరిణామాలపై మేమంతా ఆందోళన చెందుతున్నాం.
ఈ సందర్భంలో, పరస్పర సహకారం , ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వం చాలా అవసరం.
గౌరవనీయులారా,
నేటి శిఖరాగ్ర సదస్సులో మూడు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి.
మొదటిది , ప్రాంతీయ భద్రత మరియు శ్రేయస్సు కోసం , భారతదేశం మరియు మధ్య ఆసియా మధ్య పరస్పర సహకారం అవసరమని స్పష్టం చేయడానికి.
భారతదేశం తరపున, మా విస్తృత పొరుగు ప్రాంతాలకు వ్యూహాత్మక మరియు సమగ్ర విధానానికి మధ్య ఆసియా కేంద్రంగా ఉందని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను.
రెండవ లక్ష్యం మీ భాగస్వామికి సమర్థవంతమైన నిర్మాణాన్ని , ఖచ్చితమైన రూపురేఖలను అందించడం .
ఇది వివిధ స్థాయిలలో మరియు విభిన్న ఆసక్తి సమూహాల మధ్య సాధారణ కమ్యూనికేషన్ వ్యవస్థను సృష్టిస్తుంది.
మరియు , మూడవది, మీ సహకారం కోసం ప్రతిష్టాత్మకమైన ప్రణాళికను రూపొందించడం లక్ష్యం .
దాని ద్వారా , రాబోయే ముప్పై సంవత్సరాలలో ప్రాంతీయ అనుసంధానం మరియు సహకారాన్ని నిర్మించడానికి మనం ఒక సమగ్ర విధానాన్ని అవలంబించవచ్చు .
గౌరవనీయులారా,
మరోసారి, భారతదేశం-మధ్య ఆసియా సమ్మిట్ మొదటి సమావేశానికి మీ అందరినీ నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను.
*****
(रिलीज़ आईडी: 1793744)
आगंतुक पटल : 232
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam