జౌళి మంత్రిత్వ శాఖ

టెక్స్‌టైల్స్ రంగంలోని సంస్థ‌లు ఉత్ప‌త్తి ఆధారిత ప్రోత్సాహ‌క (పీఎల్ఐ) పథకం కింద దరఖాస్తు దాఖలు చేసుకునేందుకు గ‌డువు పొడిగింపు

Posted On: 28 JAN 2022 12:24PM by PIB Hyderabad

టెక్స్‌టైల్స్ రంగంలోని సంస్థ‌లు పీఎల్ఐ స్కీమ్ కింద దరఖాస్తులు సమర్పించేందుకు జౌళి మంత్రిత్వ శాఖ గడువును 14.02.2022 వరకు పొడిగించింది. గతంలో టెక్స్‌టైల్ రంగంలోని సంస్థ‌లు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తును సమర్పించేందుకు ఆఖ‌రు తేదీని 31 జనవరి2022గా నిర్ణ‌యించింది. అర్హత గల దరఖాస్తుదారులు ఆన్‌లైన్ ద్వారా https://pli.texmin.gov.in/mainapp/Default లింక్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. పథకం యొక్క వివరణాత్మక మార్గదర్శకాలు ఈ క్రింది లింక్‌లో అంద‌రికీ అందుబాటులో
ఉన్నాయి. https://pli.texmin.gov.in/Guidelines/Approved%20Guidelines%20for%20PLI%20scheme%20for%20Textiles.pdf.
                                                               

*****



(Release ID: 1793412) Visitor Counter : 144