ప్రధాన మంత్రి కార్యాలయం

మకర సంక్రాంతి.. ఉత్తరాయణం.. భోగి.. మాఘ్‌ బిహు.. పొంగల్ సందర్భంగా దేశ ప్రజలకు ప్ర‌ధాన‌మంత్రి శుభాకాంక్షలు

Posted On: 14 JAN 2022 9:18AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశ ప్రజలనుద్దేశించి వరుస ట్వీట్లద్వారా ఇచ్చిన సందేశంలో-

   “భారతదేశంలో ఉజ్వల సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటే వివిధ పండుగలు చేసుకుంటున్నాం. ఈ పండుగల సందర్భంగా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు. తదనుగుణంగా ఆయా పండుగ చేసుకుంటున్న ప్రజలకు ప్రత్యేకంగా సందేశం పంపారు.

“మకర సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు.”

https://t.co/4ittq5QTsr

“ఉత్తరాయణం పండుగను వైభవంగా నిర్వహించుకోండి.”

https://t.co/hHcMBzBJZP

“అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పర్వదినం మన సమాజంలో ఆనంద స్ఫూర్తిని సుసంపన్నం చేయాలి. ఈ మేరకు నా దేశ పౌరులందరికీ చక్కని ఆరోగ్యం-శ్రేయస్సు కలగాలని ఆ దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను.”

https://t.co/plBUW3psnB

“మీకందరికీ మాఘ్‌ బిహు శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం ఇనుమడింపజేయాలని, సౌభాగ్యం ప్రసాదించాలని నేను ఆ సర్వేశ్వరుణ్ని ప్రార్థిస్తున్నాను.”

https://t.co/mEiRGpHweZ

“తమిళనాడు ఉజ్వల సంస్కృతిలో పొంగల్‌ పండుగ అంతర్భాగం. ఈ ప్రత్యేక సందర్భంలో ప్రతి ఒక్కరికీ.. ముఖ్యంగా ప్రపంచం అంతటాగల తమిళ ప్రజానీకానికి నా శుభాకాంక్షలు. ప్రకృతితో మన అనుబంధంతోపాటు సమాజంలో సోదర భావం అనంతంగా వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.

https://t.co/FjZqzzsLhr

 

***

DS/SH



(Release ID: 1789864) Visitor Counter : 151