ప్రధాన మంత్రి కార్యాలయం

మాతా వైష్ణోదేవి భవన్ వద్ద తొక్కిసలాటలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం

Posted On: 01 JAN 2022 8:49AM by PIB Hyderabad

   మాతా వైష్ణోదేవి భ‌వ‌న్‌ వద్ద దుర్ఘటనలో ప్రాణనష్టం సంభవించడంపై ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా ఇచ్చిన సందేశంలో-

“మాతా వైష్ణోదేవి భవన్‌లో తొక్కిసలాట వల్ల ప్రాణనష్టం వాటిల్లడంపై ఎంతో కలత చెందాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గాయపడినవారు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఈ సంఘటనపై జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ శ్రీ @మనోజ్‌ సిన్హాతో మాట్లాడాను. అలాగే మంత్రులు శ్రీ @డాక్టర్‌ జితేంద్రసింగ్‌, @నిత్యానందర్‌ రాయ్‌, బీజేపీ పరిస్థితిని సమీక్షించారు” అని ఆయన పేర్కొన్నారు.

 

 

****

DS/VJ



(Release ID: 1786803) Visitor Counter : 154