ప్రధాన మంత్రి కార్యాలయం

ఆర్చ్ బిషప్ ఎమెరిటస్ డెస్మండ్ టుటు మృతికి ప్రధానమంత్రి సంతాపం

Posted On: 26 DEC 2021 2:42PM by PIB Hyderabad

ఆర్చ్ బిషప్ ఎమిరిటస్ డెస్మండ్ టుటు మరణంపై   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో - 

"ఆర్చ్ బిషప్ ఎమెరిటస్ డెస్మండ్ టుటు ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక ప్రజానీకానికి మార్గదర్శకులుగా నిలిచారు. మానవాళిపై గౌరవం.. సమానత్వాలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం  చిరస్మరణీయం. ఆయన మృతిపై నేను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈ సందర్భంగా ఆయన అభిమానులందరికీ నా హృదయపూర్వక సంతాపం తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1785317) Visitor Counter : 124