ప్రధాన మంత్రి కార్యాలయం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కె.రోశయ్య మృతిపై ప్రధాని సంతాపం
Posted On:
04 DEC 2021 12:31PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కె.రోశయ్య మృతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో-
“శ్రీ కె.రోశయ్యగారు కన్నుమూయడం ఎంతో బాధాకరం. మేమిద్దరం ముఖ్యమంత్రులుగా పనిచేసిన సమయంలోనే కాకుండా ఆ తర్వాత తమిళనాడు గవర్నర్గా ఉన్నప్పుడు ఆయనతో పలు సందర్భాల్లో నా సంభాషణను నేను గుర్తుచేసుకుంటున్నాను. ప్రజాసేవలో ఆయన కృషి చిరస్మరణీయం. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను… ఓం శాంతి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1778024)
Visitor Counter : 166
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam