ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 11 OCT 2021 9:11AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 95.19 కోట్ల డోసులను అందించారు.

రికవరీ రేటు 98.00% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 21,563 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,32,93,478 కు పెరిగింది.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.67% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,27,347. ఇది 209 రోజుల కనిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 18,132 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది 215 రోజుల కనిష్ట స్థాయి.

వారపు పాజిటివిటీ రేటు (1.53%) గత 108 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

రోజువారీ పాజిటివిటీ రేటు (1.75%) గత 42 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 58.36 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

****



(Release ID: 1762906) Visitor Counter : 157