ప్రధాన మంత్రి కార్యాలయం

టీకాల కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ ప్రధాని అభినందనలు

Posted On: 09 OCT 2021 11:00PM by PIB Hyderabad

   ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 ఈ మేరకు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ ట్వీట్‌ను ఉటంకిస్తూ ట్విట్టర్‌ ద్వారా ప్రధానమంత్రి ఒక సందేశమిచ్చారు.

   “దేశంలోని సహ పౌరులందరికీ టీకా ఇచ్చేలా టీకాల కార్యక్రమంలో ప్రతి భాగస్వామి కృషి చేశారనడానికి ఇదొక చరిత్రాత్మక ఉదాహరణ. భారత టీకాల కార్యక్రమాన్ని తిరుగులేని రీతిలో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

********

DS



(Release ID: 1762673) Visitor Counter : 156