ప్రధాన మంత్రి కార్యాలయం

భారతీయ వాయు సేన స్ధాపక దినం సందర్భంలో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 08 OCT 2021 9:47AM by PIB Hyderabad

 

భారతీయ వాయు సేన స్ధాపక దినం సందర్భంలో వాయు సేన కు, వారి కుటుంబాలకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో – 


‘‘భారతీయ వాయు సేన కు చెందిన వీర యోధులు, వారి కుటుంబాలకీ వాయు సేన స్ధాపక దినం సందర్భంలో శుభాకాంక్షలు. భరత మాత రక్షణ కోసం మీరు ప్రదర్శించే సాహసం, శౌర్యం, అంకితభావం ప్రతి ఒక్కరికి ప్రేరణను అందిస్తాయి.  దేశ గగనతలాన్ని సురక్షితంగా ఉంచడమొక్కటే కాకుండా, ఆపద సమయాల్లో మానవతాపూర్వకమైన సేవలను అందించడంలో కూడా అగ్రగామి పాత్ర ను వీరు పోషిస్తున్నారు.’’ అని పేర్కొన్నారు.

 

 

 


***

DS/SH



(Release ID: 1762058) Visitor Counter : 176