ప్రధాన మంత్రి కార్యాలయం

సింహాలసంరక్షణ పట్ల మక్కువ ను కలిగి ఉన్న వారందరికీ ప్రపంచ సింహాల దినం సందర్భం లోఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి 

Posted On: 10 AUG 2021 10:55AM by PIB Hyderabad

సింహాల సంరక్షణ పట్ల మక్కువను కలిగి ఉన్న వారందరికీ ప్రపంచ సింహాల దినం సందర్భంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో ఈ కింది విధంగా పేర్కొన్నారు.

‘‘సింహం సాహసవంతమైందీ, ఠీవి ఉట్టిపడేదీ నూ. ఆసియా ప్రాంతం లో సంతరించే ప్రత్యేక సంతతి సింహాల కు ఆశ్రయాన్ని ఇస్తున్నందుకు గాను భారతదేశం గర్వపడుతోంది. సింహాల సంరక్షణ విషయంలో మక్కువను కలిగిన వారందరికి వరల్డ్ లయన్ డేసందర్భంలో నేను నా అభినందనలను తెలియజేస్తున్నాను. గడచిన కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో సింహాల సంతతి నిలకడగా వృద్ధి చెందుతున్న సంగతి తెలిస్తే మీరు సంతోషిస్తారు.

గుజరాత్ ముఖ్యమంత్రి గా నేను నా సేవలను అందించిన కాలం లో గీర్ సింహాల కోసం సురక్షితమైనటువంటి, భద్రమైనటువంటి ఆవాసాలను ఏర్పాటు చేసే దిశలో కృషి చేసే అవకాశం నాకు లభించింది. ఆయా ఆవాసాలను పదిలంగా ఉంచడం కోసం స్థానిక సముదాయాల ప్రమేయంతో అనేక కార్యక్రమాలను చేపట్టడం తో పాటు ప్రపంచంలో అవలంబిస్తున్నటువంటి ఉత్తమమైన అభ్యాసాలను అనుసరించడం కూడా జరిగింది. మరి ఈ కారణంగా పర్యటన రంగానికి కూడా ప్రోత్సాహం లభిస్తుంది.’’



(Release ID: 1744324) Visitor Counter : 205