ప్రధాన మంత్రి కార్యాలయం

భగీరథి అమ్మ మృతికి నివాళులు అర్పించిన - ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 23 JUL 2021 9:38PM by PIB Hyderabad

గౌరవనీయులైన భగీరథి అమ్మ మృతి పట్ల ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ, తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, నివాళులు అర్పించారు.

ఈ మేరకు, ప్రధానమంత్రి, సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్‌ చేస్తూ,  "గౌరవనీయులైన భగీరథి అమ్మకు నా నివాళులు అర్పిస్తున్నాను. ఆమె జీవన ప్రయాణం నుండి,  ముఖ్యంగా కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆమె నిత్య అభిరుచి నుండి, నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి.  ఆమె మృతి చెందారన్న వార్త తెలిసి విచారించాను. ఆమె కుటుంబ సభ్యులకు, ఆరాధకులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.  ఓం శాంతి." అని పేర్కొన్నారు. 


(రిలీజ్ ఐడి: 1738439) సందర్శకుల సూచీ సంఖ్య : : 215