ప్రధాన మంత్రి కార్యాలయం

యుఎస్ఎ ప్రజల కు వారి 245వ స్వాతంత్ర్య దినం నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 04 JUL 2021 2:36PM by PIB Hyderabad

యుఎస్ఎ ప్రజల కు, యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జో బైడెన్ కు వారి 245వ స్వాతంత్ర్య దినం సందర్బం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ యుఎస్ఎ 245వ స్వాతంత్ర్య దినం నాడు యుఎస్ఎ ప్రజల కు, @POTUS @JoeBiden కు ఇవే ఆప్యాయ అభినందనలు, శుభాకాంక్షలూను.  చైతన్యభరితమైన ప్రజాస్వామ్యాలు గా భారతదేశం, యుఎస్ఎ లు స్వతంత్రత, స్వేచ్ఛ ల తాలూకు  విలువల లో పాలుపంచుకొంటున్నాయి.  మన వ్యూహాత్మక భాగస్వామ్యాని కి వాస్తవం లో ప్రపంచ స్థాయి మహత్వం ఉంది. ’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***



(Release ID: 1732736) Visitor Counter : 150