ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

30 కోట్ల డోసుల మైలురాయి దాటిన టీకాల పంపిణీ


గత 24 గంటలలో 64.89 లక్షల టీకా డోసుల పంపిణీ

గత 24 గంటలలో 54,069 కొత్త కరోనా కేసులు

చికిత్సలో ఉన్నవారి సంఖ్య 6,27,057కు తగ్గుదల

42 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకున్నవారే అధికం

కోలుకున్నవారి శాతం 96.61% కు పెరుగుదల

రోజువారీ పాజిటివిటీ 2.91%, 17 రోజులుగా 5% లోపు నమోదు

Posted On: 24 JUN 2021 11:06AM by PIB Hyderabad

టీకాల కార్యక్రమంలో భారత్ మరో మైలరాయి దాటింది.  నిన్నటికి 30 కోట్ల డోసుల టీకాలు పూర్తి చేసుకుంది. ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం ప్రకారం 40,45,516  శిబిరాల ద్వారా మొత్తం  30,16,26,028 టీకా డోసుల పంపిణీ జరగగా  గత 24 గంటలలో 64,89,599 టీకాలిచ్చారు.  ఆ వివరాలు ఇలా ఉన్నాయి

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,01,58,915

రెండో డోస్

71,32,888

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,73,03,658

రెండో డోస్

91,85,106

18-44 వయోవర్గం

మొదటి డోస్

7,06,62,665

రెండో డోస్

15,02,078

45-59  వయోవర్గం

మొదటి డోస్

8,39,38,683

రెండో డోస్

1,33,51,488

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

6,61,61,004

రెండో డోస్

2,22,29,543

మొత్తం

30,16,26,028

 

సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది.

గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  54,069 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ విధంగా రోజుకు లక్ష లోపు కేసులు రావటం గత 17 రోజులుగా నడుస్తోంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల్ ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001NWSQ.jpg

 

చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల కూడా కనబడుతోంది. ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారు 6,27,057 మంది. చికిత్సలో ఉన్నవారు నికరంగా 16,137 మంది గత 24 గంటల్లోనే తగ్గగా చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 2.08% మాత్రమే కావటం గమనార్హం

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020R70.jpg

 

 కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 421 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. గత 24 గంటలలో  68,885 మంది కోలుకున్నారు.  అంతకు ముందురోజుకంటే 14,816 మంది అదనంగా కోలుకున్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003MJ96.jpg

 

 ఇప్పటివరకూ కోవిడ్ బారిని పడి కోలుకున్నవారు 2,90,63,740 మంది కాగా గత 24 గంటలలో 68,885 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి శాతం 96.61% కు పెరిగింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004XCOW.jpg

 

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 18,59,469 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 39.78 కోట్లకు పైగా (39,78,32,667) అయ్యాయి.

ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  3.04% కాగా రోజువారీ పాజిటివిటీ  2.91%  అయింది. వరుసగా 17 రోజులుగా ఇది 5% లోపే ఉంటోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005H65V.jpg



(Release ID: 1730051) Visitor Counter : 213