ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

తగ్గుతున్న కోవిడ్ కేసులు; గత 24 గంటల్లో 1.52 లక్షలు


గత 50 రోజుల్లో అత్యల్ప స్థాయికి రోజువారీ కోవిడ్ కేసులు
గత 24 గంటల్లో చికిత్సలో ఉన్న కేసుల్లో 88,416 తగ్గుదల

ప్రస్తుతం ఇంకా చికిత్సలో ఉన్నవారు 20,26,092 మంది

18 రోజులుగా కొత్తకేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ
కోలుకున్నవారి శాతం 91.60% కు పెరుగుదల
రోజువారీ పాజిటివిటీ 9.07%, వారం రోజులుగా 10% లోపే

పరీక్షా సామర్థ్యం పెంపు, ఇప్పటిదాకా దాదాపు 34.48 కోట్ల పరీక్షలు
ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా21.3 కోట్ల టీకా డోసులు

Posted On: 31 MAY 2021 10:38AM by PIB Hyderabad

రోజువారీ కొత్త కరోనాకేసులు తగ్గుతూ వస్తుననయి. గత 24 గంటలలో 1.52 లక్షల కొత్త కేసులు నమోదు కాగా ఇది గడిచిన 50 రోజుల్లో అత్యల్క్పం కావటం గమనార్హం. దీంతో, వరుసగా నాలుగో రోజుకూడా రెండు లక్షలలోపే కొత్త కెసులు వచ్చినట్టయింది. నిన్న నమోదైన కేసులు 1,52,734 

 https://static.pib.gov.in/WriteReadData/specificdocs/photo/2021/may/ph202153101.jpg

చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారు సంఖ్య  20,26,092 కి తగ్గింది.  గత 24 గంటలలో నికరంగా  88,416 మంది చికిత్సలో ఉన్నవారు తగ్గారు. మొత్తం పాజిటివ్ కేసులలో ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి వాటా  7.22%  మాత్రమే

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002U3ZM.jpg

దేశంలో కొత్త కోవిడ్ కెసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. గత 18 రోజులుగా ఇదే ధోరణి కొనసాగుతోంది. గత 24 గంటలలో 2,38,022 మంది కోలుకున్నారు.  ఇది అంతకుముందు రోజు కోలుకున్నవారి కంటే  85,288 అధికం

 

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/photo/2021/may/ph202153121.jpg

కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఈ వ్యాధి సోకినవారిలో 2,56,92,342 మంది కోలుకున్నారు. వారిలో గడిచిన 24 గంటల్లో కోలుకున్నవారు  2,38,022 మంది, దీంతో మొత్తం కోలుకున్నవారి శాతం   91.60% కి చేరింది.

 https://static.pib.gov.in/WriteReadData/specificdocs/photo/2021/may/ph202153131.jpg

గత 24 గంటలలో 16,83,135 కరోనా పరీక్షలు జరపగా ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా జరిపిన పరీక్షలు  34.48 కోట్లు దాటాయి. పరీక్షల సంఖ్య ఒకవైపు పెరుగుతూ ఉండగా పాజిటివిటీ తగ్గటం మరోవైపు కొనసాగుతోంది. వారపు పాజిటివిటీ  9.04%  కాగా ఈరోజు ఇంకా తగ్గి  9.07% గా నమోదైంది. ఇది వరుసగా వారం రోజులుగా 10% లోపే ఉంటూ వస్తోంది.

 https://static.pib.gov.in/WriteReadData/specificdocs/photo/2021/may/ph202153141.jpg

దేశవ్యాప్తంగా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల మొత్తం సంఖ్య ఈ రోజుకు 21.31 కోట్లు దాటింది. ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం ప్రకారం 30,28,295 శిబిరాల ద్వారా మొత్తం  21,31,54,129 టీకా డోసుల పంపిణీ జరిగింది. అవి:   

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

98,67,310

రెండో డోస్

67,76,644

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,55,92,325

రెండో డోస్

84,97,120

18-44 వయోవర్గం

మొదటి డోస్

1,89,64,595

రెండో డోస్

10,058

45 -60  వయోవర్గం

మొదటి డోస్

6,56,60,693

రెండో డోస్

1,05,74,441

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,85,28,448

రెండో డోస్

1,86,82,495

మొత్తం

21,31,54,129

 

****



(Release ID: 1723082) Visitor Counter : 209