రైల్వే మంత్రిత్వ శాఖ

కోవిడ్ సవాళ్లు ఉన్నప్పటికీ రైల్వే, సరకు రవాణా లో రెండంకెల వృద్ధిని కొనసాగించింది


2019-20 సంవత్సరంతో పోలిస్తే ఫ్రైట్ లోడింగ్‌లో 10% పెరుగుదల

2021-22 ఆర్థిక సంవత్సరంలో, భారత రైల్వే మొత్తం లోడింగ్ 203.88 మిలియన్ టన్నులు (ఎమ్ టి), అదే కాలానికి 2019-20 లోడింగ్ గణాంకాలు (184.88 ఎమ్ టి) కంటే 10% ఎక్కువ.

2021 మే నెలలో, భారత రైల్వే లోడింగ్ 92.29 మెట్రిక్ టన్నులు, ఇది 2019 మే కంటే 10% ఎక్కువ (83.84 మెట్రిక్ టన్నులు) మరియు అదే కాలానికి మే 2020 (64.61 మెట్రిక్ టన్నులు) కంటే 43% ఎక్కువ.

ఈ మే 2021 లో భారత రైల్వే సరుకు రవాణా నుండి రూ.9278.95 కోట్లు ఆర్జించింది

వ్యాగన్ల వినియోగంలో భారీ మెరుగుదల, సరుకు రవాణా రైళ్ల వేగం పెంచడం, సరుకు రవాణా వినియోగదారులకు ప్రోత్సాహకాలు, వ్యాపార అభివృద్ధి యూనిట్ల చురుకైన పని ఫలితంగా సరుకు రవాణాలో రెట్టింపు పెరుగుదల ఏర్పడింది.

Posted On: 26 MAY 2021 2:57PM by PIB Hyderabad

కోవిడ్‌ విసిరిన సవాలు భారతీయ రైల్వే వేగాన్ని ఆపలేదు. సరకు రవాణాలో వృద్ధి ఏ మాత్రం తగ్గకుండా సాగుతోంది. రైల్వే సరుకు రవాణాలో రెండంకెల వృద్ధిని సాధించింది. భారతీయ రైల్వేలకు 2021 మే నెలలో ఆదాయాలు, లోడింగ్ పరంగా సరుకు గణాంకాలలో మంచి ప్రగతిని సూచించాయి. రైల్వేలు సరుకు లోడింగ్‌లో 10% కంటే ఎక్కువ పెరుగుదలను నమోదు చేశాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో, భారతీయ రైల్వే మొత్తం లోడింగ్ 203.88 మిలియన్ టన్నులు (ఎమ్ టి), అదే కాలానికి 2019-20 లోడింగ్ గణాంకాలు (184.88 ఎమ్ టి) కంటే 10% ఎక్కువ.

మిషన్ మోడ్‌లో, భారతీయ రైల్వేల సరుకు లోడింగ్ మే 2021 నెలలో 92.29 మెట్రిక్ టన్నులు, ఇది 2019 మే కంటే 10% ఎక్కువ (83.84 మెట్రిక్ టన్నులు), అదే కాలానికి మే 2020 (64.61 మెట్రిక్ టన్ను) కంటే 43% ఎక్కువ.

మే 2021 లో రవాణా చేయబడిన ముఖ్యమైన వస్తువులలో 97.06 మిలియన్ టన్నుల బొగ్గు, 27.14 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం, 7.89 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 5.34 మిలియన్ టన్నుల ఎరువులు, 6.09 మిలియన్ టన్నుల ఖనిజ నూనె, 11.11 మిలియన్ టన్నుల సిమెంట్ (క్లింకర్ మినహా),  8.2 మిలియన్ టన్నుల క్లింకర్ ఉన్నాయి. 2021 మే నెలలో భారత రైల్వే సరుకు రవాణా నుండి రూ.9278.95 కోట్లు ఆదాయం వచ్చింది. వాగన్ వినియోగం ఈ నెలలో 27% ఉంది. మే, 2021 లో, వాగన్ టర్న్ రౌండ్ టైమ్ ఇది 2019 మేలో 6.61 తో పోలిస్తే 4.83 రోజులుగా నమోదైంది. 

రైల్వే సరుకు రవాణాను ఇంకా పెంచడానికి  భారతీయ రైల్వేలో కూడా అనేక రాయితీలు / తగ్గింపులు ఇవ్వడం విశేషం. ప్రస్తుత నెట్‌వర్క్‌లో సరుకు రవాణా రైళ్ల వేగం పెరిగింది. ఫ్రైట్ స్పీడ్ ఇంప్రూవ్‌మెంట్, వ్యయం ఆదాఅవుతోంది. గత 18 నెలల్లో సరుకు వేగం రెట్టింపు అయ్యింది. కొన్ని మండలాలు (ఆరు మండలాలు) సరుకు రవాణా రైళ్ల సగటు వేగాన్ని 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ నమోదు చేశాయి. భౌగోళిక పరిస్థితుల కారణంగా, కొన్ని విభాగాలు సరుకు రవాణా రైళ్లకు మంచి వేగాన్ని అందిస్తాయి. సరుకు రవాణా రైళ్ల కోసం సగటున 45.42 కిలోమీటర్ల వేగం మే 2021 లో నమోదైంది, అదే కాలానికి ఇది 36.84 కిలోమీటర్ల వేగంతో పోలిస్తే 23% ఎక్కువ. కోవిడ్ 19 ను భారత రైల్వే పనితీరులను మెరుగుపరిచేలా అవకాశంగా ఉపయోగించుకుంది.

****



(Release ID: 1721995) Visitor Counter : 130