ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

26 రోజుల తరువాత 3 లక్షల లోపుకు పడిపోయిన రోజువారీ కోవిడ్ కేసులు


గత 24 గంటల్లో 15.37 లక్షల పరీక్షలతో వారపు పాజిటివిటీ శాతం 18.17%కు తగ్గుదల

Posted On: 17 MAY 2021 12:08PM by PIB Hyderabad

గత 26 రోజులలో మొదటి సారిగా రోజువారీ కొత్త కోవిడ్ కేసులు 3 లక్షల దిగువకు పడిపోవటం ఆశాజనక పరిణామం. గత 24 గంటల్లో 2,81,386 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.ఈ నెల 9 వ తేదీ నూమ్చి కొత్త కెసులు తగ్గిముఖం పట్టటాన్ని ఈ దిగువ చిత్రపటం చూపుతుంది..

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001SCQA.jpg

వారపు పాజిటివిటీ శాతం తగ్గటాన్ని ప్రతిబింబిస్తూ ఈరోజు 18.17% నమోదైనట్టు క్రింది చిత్రపటం చూపుతోంది. గత 24 గంటలలో జరిపిన కోవిడ్ నిర్థారణ పరీక్షలు 15,73,515 కాగా, ఇప్పటిదాకా దేశమంతటా జరిపిన మొత్తం పరీక్షలు 31,64,23,658

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0026YGN.jpg

రాష్ట్రాలవారీగా అత్యధిక స్థాయిలో పాజిటివ్ కెసులు నమోదవుతున్న జిల్లాల వివరాలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి.  కర్నాటకలో అత్యధికంగా 27 జిల్లాల్లో 20% పైగా పాజిటివిటీతో కేసులు ఎక్కువగా వస్తుండగా  మధ్య ప్రదేశ్ లో అత్యధిక సంఖ్యలో 38 జిల్లాల్లో 10% మించి పాజిటివిటీ నమోదవుతోంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003WIRL.jpg

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోవిడ్ బారినుంచి కోలుకున్నవారి సంఖ్య  2,11,74,076కు చేరింది. అందువలన జాతీయ స్థాయి కోలుకున్నవారి శాతం  84.81% అయింది. గత 24 గంటలలో  3,78,741 మంది కోలుకున్నారు. అదే సమయంలో కొత్త కేసులకంటే కోలుకున్నవారు ఎక్కువగా ఉండటం గత 7 రోజుల్లో 6 సార్లు కాగా వరుసగా నాలుగురోజులుగా  ఈ పరిస్థితి కొనసాగుతోంది. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0048HFE.jpg

కొత్తగా కోలుకున్నవారిలో 71.35% మంది పది రాష్ట్రాలకు చెందినవారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005TPG9.jpg

మరోవైపు దేశంలో చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య తగ్గి 35,16,997 కు చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో  14.09%. గత 24 గంటలలో చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య నికరంగా 1,01,461 కేసుల తగ్గుదల నమొదు చేసుకుంది.  ఇందులో పది రాష్ట్రాల వాటా 75.04% ఉంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0066EJ5.jpg

దేశవ్యాప్తంగా మూడో విడత టీకాల కార్యక్రమం కూదా మొదలవటంతో  ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం కోవిడ్ డోసులు దాదాపు 18.30 కోట్లకు చేరాయి.

ఈ రోజు ఉదయం 7 గంటలవరకు అందిన తాత్కాలిక నివేదిక ప్రకారం మొత్తం 18,29,26,460  డోసులను 26,68,895 శిబిరాల ద్వారా పంపిణీచేశారు. అందులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన 96,45,695 మొదటి డోసులు,  66,43,661 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన  1,44,44,096 మొదటి డోసులు, 81,96,053 రెండో డోసులు, 18-44 వయోవర్గం వారికిచ్చిన  52,64,073 మొదటి డోసులు, 45-60 వయోవర్గానికిచ్చిన  5,72,78,554 మొదటి డోసులు,  91,07,311 రెండో డోసులు, 60 పైబడ్డవారికిచ్చిన 5,45,15,352 మొదటి డోసులు,  1,78,01,891 రెండో డోసులు ఉన్నాయి.  

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

96,45,695

రెండో డోస్

66,43,661

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,44,44,096

రెండో డోస్

81,96,053

18-44 వయోవర్గం

మొదటి డోస్

52,64,073

45 -60వయోవర్గం

మొదటి డోస్

5,72,78,554

రెండో డోస్

91,07,311

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,45,15,352

రెండో డోస్

1,78,31,665

 

మొత్తం

18,29,26,460

 

దేశంలో ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం టీకా డోసులలో పది రాష్టాలవాటా 66.73% ఉంది.  

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0074FL7.jpg

18-44 వయోవర్గానికి చెందిన 4,35,138 మంది లబ్ధిదారులు గత 24 గంటలలో మొదటి డోస్ అందుకున్నారు. దీంతో 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ వయోవర్గంలో టీకాలు తీసుకున్నవారి మొత్తం సంఖ్య  52,64,073 కు చేరింది.  ఆ సమాచారం ఈ క్రింది పట్టికలో ఉంది.

 

సంఖ్య

రాష్ట్రం

మొత్తం

1

అండమాన్, నికోబార్ దీవులు

1,181

2

ఆంధ్రప్రదేశ్

3,443

3

అస్సాం

2,29,233

4

బీహార్

7,36,144

5

చండీగఢ్

2,078

6

చత్తీస్ గఢ్

1,028

7

దాద్రా, నాగర్ హవేలి

4,291

8

డామన్, డయ్యూ

4,703

9

ఢిల్లీ

6,39,929

10

గోవా

7,929

11

గుజరాత్

5,12,290

12

హర్యానా

4,55,205

13

హిమాచల్ ప్రదేశ్

14

14

జమ్మూకశ్మీర్

31,204

15

జార్ఖండ్

1,09,245

16

కర్నాటక

1,14,539

17

కేరళ

2,398

18

లద్దాఖ్

570

19

మధ్యప్రదేశ్

1,81,735

20

మహారాష్ట్ర

6,52,119

21

మేఘాలయ

5,712

22

నాగాలాండ్

4

23

ఒడిశా

1,40,558

24

పుదుచ్చేరి

3

25

పంజాబ్

6,959

26

రాజస్థాన్

8,16,241

27

సిక్కిం

350

28

తమిళనాడు

32,645

29

తెలంగాణ

500

30

త్రిపుర

2

31

ఉత్తరప్రదేశ్

4,15,179

32

ఉత్తరాఖండ్

1,22,916

33

పశ్చిమ బెంగాల్

33,726

మొత్తం

52,64,073

 

గత 24 గంటలలో దాదాపు 7 లక్షల టీకా డోసుల పంపిణీ జరిగింది.  టీకాలు మొదలైన 121వ రోజైన మే 16 నాడు 6,91,211 టీకాలు 6,068 శిబిరాల ద్వారా ఇవ్వగా అందులో 6,14,286 మంది లబ్ధిదారులు మొదటి డోస్, 76,925 మంది రెండో డోస్ తీసుకున్నారు.

తేదీమే 16, 2021 (121వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

3,270

రెండవ డోస్

2,395

కోవిడ్ యోధులు

మొదటి డోస్

18,168

రెండవ డోస్

9,077

18-44 వయోవర్గం

మొదటి డోస్

4,35,138

45 -60 వయోవర్గం

మొదటి డోస్

1,13,616

రెండవ డోస్

37,979

60 పైబడ్డవారు

మొదటి డోస్

44,094

రెండవ డోస్

27,474

మొత్తం

మొదటి డోస్

6,14,286

రెండవ డోస్

76,925

 

తాజాగా నిర్థారణ అయిన కరోనా కేసుల్లో 75.95% పది రాష్ట్రాలకు చెందినవే కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 34,389 కేసులు, ఆ తరువాత స్థానంలో ఉన్న తమిళనాడులో 33,181 కేసులు నమోదయ్యాయి.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008838S.jpg

జాతీయ స్థాయిలో మరణాల శాతం  1.10% గా నమోదంది. గత 24 గంటలలో 4,106 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అందులో పది రాష్ట్రాల వాటా 75.38% ఉండగా మహారాష్ట్రలో అత్యధికంగా  ఒక్క రోజులో 974 మంది, కర్నాటకలో 403 మంది కోవిడ్ తో చనిపోయారు .

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0094F9X.jpg

విదేశీ సాయానికి తోడుగా సహాయ సామగ్రిని అత్యంత వేగంగా రాష్టాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటిదాకా దాకా మొత్తం 11,058 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు; 13,496 ఆక్సిజెన్ సిలిండర్లు; 19 ఆక్సిజెన్ తయారీ ప్లాంట్లు; 7,365 వెంటిలేటర్లు; దాదాపు  5.3 లక్షల రెమిడిసెవిర్ ఇంజెక్షన్లు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ జరిగాయి. రోడ్డు, వాయు మార్గాల ద్వారా ఈ పంపిణీ కొనసాగుతోంది.

 

****



(Release ID: 1719320) Visitor Counter : 182