ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

తేలికపాటి కోవిడ్ లక్షణాలు ఉన్న రోగులకు మందులు, వైద్య సంరక్షణ పై మార్గనిర్దేశనం చేసిన - ఎయిమ్స్ వైద్యులు

Posted On: 15 MAY 2021 1:47PM by PIB Hyderabad

 

కోవిడ్-19 రోగులలో సాధారణంగా జ్వరం, పొడి దగ్గు, అలసట, రుచి లేదా వాసన కోల్పోవడం వంటి లక్షణాలను గమనించడం జరిగింది. గొంతులో గరగర, చికాకు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు, కళ్ళు ఎర్రబడటం వంటి లక్షణాలు కూడా చాలా అరుదుగా గమనించడం జరిగింది.  మీరు ఈ లక్షణాలను గమనించినట్లయితే, మీరు వెంటనే ఇతరుల నుండి దూరంగా, ఐసోలేషన్ లో ఉండాలి.  కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడిన రోగుల కోసం “మందుల వాడకంతో పాటు ఇళ్ళల్లో ఐసోలేషన్ లో సంరక్షణ” అనే అంశంపై నిర్వహించిన వెబీనార్ సందర్భంగా ఢిల్లీలోని ఎయిమ్స్ కి చెందిన డాక్టర్ నీరజ్ నిశ్చల్ ఈ విషయాన్ని తెలియజేశారు.  వెబీనార్‌ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన "సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" నిర్వహించింది.

ఈ వ్యాధి సోకిన రోగులలో 80 శాతం మంది చాలా తేలికపాటి లక్షణాలను కలిగి ఉంటారు.  ఆర్.టి-పి.సి.ఆర్. పరీక్షలో నెగిటివ్ వచ్చినా, లక్షణాలు ఉన్నట్లయితే, మరొక పరీక్ష చేయించుకోవలసిందిగా సిఫార్సు చేయడం జరిగింది.  ఆసుపత్రిలో చేరాలా వద్దా అనే విషయాన్ని, వ్యాధి తీవ్రత ఆధారంగా, నిర్ణయించుకోవాలి.

మందులను సరైన పరిమాణంలో,  ఖచ్చితమైన సమయంలో తీసుకోవాలి.  About షధం గురించి తెలుసుకోవడం సరిపోదు; రోగులు ఎలా, ఎప్పుడు తీసుకోవాలో కూడా తెలుసుకోవాలి, అప్పుడే ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు అవుతుందని డాక్టర్ నీరజ్ అన్నారు.  కేవలం ఔషధం గురించి తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు, రోగులు వాటిని, ఎప్పుడు, ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకోవాలి. అప్పుడే, ఆ మందులు పూర్తి ప్రయోజనాన్ని చేకూరుస్తాయన్న విషయం రుజువయ్యిందని, డాక్టర్ నీరజ్ వివరించారు. 

రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులతో పాటు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న, 60 ఏళ్ళు పైబడిన రోగులకు, ఇళ్ళవద్ద ఐసోలేషన్ లో ఉంచాలన్న నిర్ణయాన్ని వైద్యులను సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి.

 

వ్యాధి నివారణలో భాగంగా కోవిడ్-19 పాజిటివ్ రోగులు తీసుకోవలసిన కొన్ని చర్యలు ఈ విధంగా ఉన్నాయి: 

రోజువారీ ఔషధాలను తీసుకోవాలి, పరిసరాలు, శారీరిక పరిశుభ్రత పై శ్రద్ధ వహించాలి.  వైద్య పరంగా నిర్ధారించిన మాస్కులను ముందుగానే నిల్వ చేసుకోవాలి.  రోజువారీ నిత్యావసర వస్తువుల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆరోగ్య సంబంధిత సమాచారం, ఆరోగ్య కార్యకర్తలు, హాట్‌-లైన్‌ లు మొదలైన వాటి కోసం సంప్రదించవలసిన టెలిఫోను నెంబర్ల జాబితాను అందుబాటులో ఉంచుకోవాలి.   వీటితో పాటు, స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులు, పొరుగువారిని అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి వీలుగా వారి టెలిఫోను నెంబర్లను కూడా అందుబాటులో సిద్ధంగా ఉంచుకోవాలి.  కుటుంబంలోని పిల్లల సంరక్షణ కోసం కూడా సరైన ప్రణాళిక రూపొందించుకోవాలి. 

తేలికపాటి లక్షణాలు మరియు అసలు లక్షణాలు లేని రోగులను ఇళ్ళవద్దనే, ఐసోలేషన్ లో ఉంచాలి.  అటువంటి రోగులు ఇతర కుటుంబ సభ్యుల నుండి, ముఖ్యంగా పిల్లల నుండి సురక్షిత దూరంలో ఉండడానికి తగిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  తరచుగా అవసరమైన మందులను రోగులకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా ఉంచాలి.  రోగుల సంరక్షకులు మరియు వైద్యుల మధ్య సమాచారం కోసం తరచుగా, సరైన, సంప్రదింపులు జరిగేలా చూడాలి.  పాజిటివ్ రోగులు ఎప్పుడూ మూడు పొరల మాస్క్ ధరించాలి.  ప్రతి 8 గంటలకు మాస్కులను తొలగించి, శుభ్ర పరిచిన అనంతరం మూత ఉన్న చెత్త బుట్టలో వెయ్యాలి.   రోగులు మరియు సంరక్షకులు ఇద్దరూ,  ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు, ఎన్-95 మాస్కులు ధరించాలి.

"పల్స్ ఆక్సిమీటర్" ను జాగ్రత్తగా ఉపయోగించి, శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను చాలా పర్యవేక్షిస్తూ ఉండాలి.   "పల్స్ ఆక్సిమీటర్" ను ఉపయోగించే ముందు, కృత్రిమ గోర్లు లేదా నెయిల్ పాలిష్ తొలగించాలి, రోగి చెయ్యి చల్లగా ఉంటే, చేతిని వేడి చేయాలి. పరీక్షకు ముందు కనీసం ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఐదు సెకన్ల పాటు స్థిరంగా ఉన్న సంఖ్య,  మీ శరీరంలోని ఆక్సిజన్ స్థాయి ని సూచిస్తుంది.  "రెమ్‌డెసివిర్‌" మందును ఇంట్లో స్వంతంగా ఎప్పుడూ తీసుకోకూడదు. ఇళ్ళలో ఐసోలేషన్ లో ఉన్న రోగులకు సానుకూల వైఖరి, క్రమమైన వ్యాయామం తప్పనిసరి అని డాక్టర్ నీరజ్ తెలియజేశారు. 

“తేలికపాటి లక్షణాలున్న కోవిడ్-19 రోగులకు చికిత్స సమయంలో సవరించిన మార్గదర్శకాలు” అనే అంశంపై, ఢిల్లీలోని  ఎయిమ్స్ కు చెందిన డాక్టర్ మనీష్, మాట్లాడుతూ,  ఆక్సిజన్ స్థాయి 94 కన్నా తక్కువగా ఉన్న రోగులను, ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చాలని, సూచించారు. ఆక్సిజన్ స్థాయిని తనిఖీ చేసి, నిర్ధారణ చేసే సమయంలో, రోగి వయస్సుతో పాటు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులను పరిగణలోకి తీసుకోవాలి. 

"ఐవర్‌మెక్టిన్" వాడకం గురించి డాక్టర్ మనీష్ మాట్లాడుతూ, రోగనిరోధక శక్తి స్థాయితో పాటు, రోగికి ఉన్న ఇతర నిర్దిష్ట పరిస్థితులపై ఆధారపడి, ఈ మందును, ఉపయోగించాలని తెలియజేశారు.  "పారాసెటమాల్" విషయంలో కూడా ఇదే సూచనలు పాటించాలి.  అందువల్ల, వైద్యులు సూచించే మందులు మాత్రమే చేయాలి.

"ఫాబిఫ్లు" గురించి, ఆయన తెలియజేస్తూ, కోవిడ్-19 చికిత్సకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల్లో "ఫాబిఫ్లూ" వాడకం గురించి ప్రస్తావించినట్లు చెప్పారు. 150 మంది రోగులపై "గ్లెన్‌మార్క్" చేసిన పరిశోధనల ఆధారంగా ఈ సిఫార్సు చేయడం జరిగింది. అయితే, "ఐవర్‌మెక్టిన్" వాడకం గురించి ఈ మార్గదర్శకాల్లో చేర్చలేదు. 

చాలా మంది రోగులు "అజిత్రోమైసిన్" వాడతామని పట్టుబడుతున్నారు, అయితే, ఈ మాత్రలు వాడవద్దని మార్గదర్శకాలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. అదేవిధంగా, "రెవిడాక్స్" వాడవద్దని కూడా సూచించడం జరిగింది.  ఇళ్ళల్లో ఐసోలేషన్ లో ఉన్నప్పుడు,  "రెవిడాక్స్" ఉపయోగించవద్దని డాక్టర్ చెప్పారు.

ఇళ్ళల్లో ఐసోలేషన్ లో ఉన్నప్పుడు, వైద్యులని సంప్రదించకుండా, ఎటువంటి మందులు తీసుకోరాదని, ఈ చర్చ సందర్భంగా, ఇద్దరు నిపుణులు, స్పష్టంగా చెప్పారు. 

*****

 



(Release ID: 1718895) Visitor Counter : 548