ప్రధాన మంత్రి కార్యాలయం

మే 14వ తేదీన పి.ఎం-కిసాన్ కింద 8వ విడత ఆర్థిక ప్రయోజనాన్ని విడుదల చేయనున్న - ప్రధానమంత్రి

Posted On: 13 MAY 2021 1:15PM by PIB Hyderabad

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పి.ఎం-కిసాన్) పథకం కింద 8వ విడత ఆర్థిక ప్రయోజనాన్ని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, మే నెల 14వ తేదీన దృశ్య మాధ్యమం ద్వారా విడుదల చేయనున్నారు.  ఈ పధకం ద్వారా, 19 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రయోజనాన్ని, 9.5 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు, బదిలీ చేయనున్నారు.  ఈ సందర్భంగా, ప్రధానమంత్రి, రైతు లబ్ధిదారులతో సంభాషించనున్నారు. ఈ కార్యక్రమానికి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా హాజరుకానున్నారు.

పి.ఎమ్-కిసాన్ గురించి :

పి.ఎం-కిసాన్ పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారుల రైతు కుటుంబాలకు, నాలుగు నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున, మూడు సమాన వాయిదాలలో, సంవత్సరానికి 6,000 రూపాయల మేర ఆర్థిక ప్రయోజనాన్ని అందజేస్తారు.  ఈ నిధి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది.  ఈ పథకం కింద ఇంతవరకు మొత్తం 1.15 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ప్రయోజనాన్ని రైతు కుటుంబాలకు బదిలీ చేయడం జరిగింది.

 

*****



(Release ID: 1718325) Visitor Counter : 230