ప్రధాన మంత్రి కార్యాలయం

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సింగ్ సిబ్బందికి ప్రధానమంత్రి కృతజ్ఞ‌తలు

Posted On: 12 MAY 2021 12:06PM by PIB Hyderabad

   అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశంలోని నర్సింగ్ సిబ్బందికి సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా కృతజ్ఞ‌తలు తెలిపారు. ఈ మేరకు ‘‘కోవిడ్-19 మహమ్మారిపై యుద్ధంలో ముందుండి పోరాడే కష్టజీవులైన నర్సింగ్ సిబ్బందికి కృతజ్ఞ‌తలు తెలిపే సముచిత సందర్భమే ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం.’ విధుల్లో వారు ప్రదర్శించే అంకితభావం, సహానుభూతితోపాటు ఆరోగ్య భారతం దిశగా వారి చిత్తశుద్ధి ఎంతో ఆదర్శప్రాయం’’ అని ఆ సందేశంలో ఆయన పేర్కొన్నారు.

 

 

***

 

DS



(Release ID: 1718079) Visitor Counter : 112