ప్రధాన మంత్రి కార్యాలయం

దయాళువు, ప‌ర‌మ పూజ‌నీయులు డాక్ట‌ర్ఫిలిపోజ్ మార్ క్రైసాస్ టమ్ మార్ థోమా వ‌లియా మెట్రోపాలిట‌న్ క‌న్నుమూత ప‌ట్లసంతాపాన్ని వ్యక్తం చేసిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 05 MAY 2021 11:13AM by PIB Hyderabad

దయాళువు, ప‌ర‌మ పూజ‌నీయులు డాక్ట‌ర్ ఫిలిపోజ్ మార్ క్రైసాస్ టమ్ మార్ థోమా వ‌లియా మెట్రోపాలిట‌న్ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

 

‘‘దయాళువు, ప‌ర‌మ పూజనీయులు డాక్ట‌ర్ ఫిలిపోజ్ మార్ క్రైసాస్ టమ్ మార్ థోమా వ‌లియా మెట్రోపాలిట‌న్ క‌న్నుమూశార‌ని తెలిసి దుఃఖానికి లోన‌య్యాను. ఆయ‌న ను ఆయనకు గల సమృద్ధమైన ధార్మిక-ఆధ్యాత్మిక జ్ఞానం, మాన‌వుల ఇక్క‌ట్టుల ను దూరం చేయ‌డానికి ప‌డిన అశేష ప్ర‌యాస‌ల కు గాను సదా స్మ‌రించుకోవ‌డం జ‌రుగుతుంది. మాలంకారా మార్ థోమా సిరియ‌న్ చ‌ర్చి స‌భ్యుల కు ఇదే నా సంతాపం’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

***



(Release ID: 1716092) Visitor Counter : 155