ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్యలో పెరుగుదల;


గత 24 గంటల్లో 3 లక్షలకు పైగా కోలుకున్న బాధితులు

దేశవ్యాప్తంగా 29.16 కోట్లకు పైగా కోవిడ్ పరీక్షలు

Posted On: 03 MAY 2021 11:08AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇప్పటిఒదాకా జరిపిన కోవిడ్ వ్యాధి నిర్థారణ పరీక్షలు 29 కోట్లు దాటి నేడు 29,16,47,037 కి చేరాయి. ఇప్పటిదాకా

కోలుకున్నవారి సంఖ్య 1,62,93,003 కి చేరింది.  జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 81.77% గా నమోదైంది.

గత 24 గంటలలో 3,00,732 మంది కోవిడ్ నుంచి కోలుకొని బైటపడ్దారు. అందు పది రాష్ట్రాలవాటా 73.49% ఉంది..

 

దేశంలో రోజువారీ పాజిటివ్ కేసులకంటే చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుదలబాట పట్టింది. ప్రస్తుతం పాజిటివిటీ శాతం 21.19%

 

 

గత 24 గంటలలో 3,68,147 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో పది రాష్టాలు – మహారాష్ట్ర, కర్నాటక, కేరళ,

ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు., పశ్చిమ బెంగాల్ , ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, బీహార్ ల లో 73.78% కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో

అత్యధికం<గా ఒక్క రోజులో 56,647 కేసులు, కర్నాటకలో 37,733, కేరళలో  31,959 కొత్తకేసులు నమోదయ్యాయి.

 

దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కేసుల సంఖ్య 34,13,642 కు చేరుకోగా ఇది మొత్తం పాజిటివ్ కేసులలో .17.13%. గత

24 గంటలలో నికరంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్యలో  63,998 కేసుల పెరుగుదల నమోదైంది. ఇందులో పన్నెండు రాష్ట్రాల

( మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్,

 బీహార్, హర్యానా) వాటా  దేశవ్యాప్త కేసుల్లో 81.46% ఉంది.  

 

కోవిడ్ సోకినవారిలో మరణాల శాతం తగ్గుతూ ప్రస్తుతం 1.10% కి చేరింది.

గత 24 గంటలలో 3,417 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అందులో 10 రాష్ట్రాల వాటా  74.54% కాగా మహారాష్ట్రలో

అత్యధికంగా 669 మంది, ఆ తర్యువాత ఢిల్లీలో 407 మంది, ఉత్తరప్రదేశ్ లో 288 మంది చనిపోయారు.

 

మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి:

డామన్-దయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, లక్షదీవులు, అరుణాచల్ ప్రదేశ్

 

*****



(Release ID: 1715625) Visitor Counter : 188