ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 14.78 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ


గత 24 గంటలలో 25 లక్షలకు పైగా టీకాలు

గడిచిన 24 గంటల్లో 2.60 లక్షలకు పైగా కోలుకున్న కోవిడ్ బాధితులు

గత 24 గంటల్లో కోవిడ్ మరణం నమోదు కాని ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు

Posted On: 28 APR 2021 11:17AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ డోసుల సంఖ్య 14.78 కోట్లు దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 21,18,435 శిబిరాల ద్వారా 14,78,27,367 డోసుల కోవిడ్ టీకాల పంపిణీ జరిగింది.  ఇందులో ఆరోగ్య సిబ్బంది  తీసుకున్న 93,47,775 మొదటి డోసులు,  61,06,237 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన 1,22,21,975 మొదటి డోసులు, 65,26,378 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డ వారికిచ్చిన 5,10,85,677 మొదటి డోసులు,  93,37,292 రెండో డోసులు, 45-60 ఏళ్ళ మధ్య వయసున్నవారికిచ్చిన 5,02,74,581 మొదటి డోసులు 29,27,452 రెండో డోసులు ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45- 60 మధ్య వయసు వారు

 60 పైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

1వ డోస్

1వ డోస్

1వ డోస్

1వ డోస్

1వ డోస్

1వ డోస్

1వ డోస్

93,47,775

61,06,237

1,22,21,975

65,26,378

5,02,74,581

29,27,452

5,10,85,677

93,37,292

14,78,27,367

 

ఇప్పటిదాకా ఇచ్చిన టీకాలలో 67.26% డోసులు పది రాష్ట్రాలలోనే ఇచ్చారు.

గడిచిన 24 గంటలలో 25 లక్షలకు పైగా టీకాలిచ్చారు. దేశవ్యాప్త కోవిడ్ టీకాల కార్యక్రమం మొదలైన 102 వ రోజైన ఏప్రిల్ 27న 25,56,182 టీకాలిచ్చారు. అందులో 15,69,000 మొదటి డోసులు 22,989 శిబిరాల ద్వారా ఇవ్వగా 9,87,182 మంది రెండో డోస్ తీసుకున్నారు.   

తేదీ: 27 ఏప్రిల్, 2021 ( 102వ రోజు)  

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45- 60 ఏళ్ళవారు

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

23,006

45,519

1,11,717

1,00,386

9,26,343

2,35,076

5,07,934

6,06,201

15,69,000

9,87,182

 

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కరోనా నుంచి బైటపడినవారి సంఖ్య at 1,48,17,371 కాగా, కోలుకున్నవారి శాతం  82.33%.

గత 24 గంటలలో కోలుకున్నవారు 2,61,162 మంది కాగా పది రాష్ట్రాల వాటా .79.01% గా నమోదైంది

 

గత 24 గంటలలో 3,60,960 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అందులో పది రాష్ట్రాలు – మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ వాటా 73.59% ఉంది.  మహారాష్ట్రలో అత్యధికంగా

66,358 కొత్త కేసులు నమోదు కాగా ఆ తరువాత స్థానంలో ఉత్తరప్రదేశ్ లో 32,921, కేరళలో 32,819 వచ్చాయి.

దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 29,78,709 కు చేరుకుంది. ఇది దేశంలో ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసులలో 16.55%.  గత 24 గంటలలో కోలుకున్నవారు పోను చికిత్స పొందుతున్నవారికి నికరంగా 96,505 మంది తోడయ్యారు. వీరిలో తొమ్మిది రాష్ట్రాలవాటా 71.91% ఉంది.

జాతీయ స్థాయిలో కోవిడ్ మరణాల శాతం తగ్గుతూ ప్రస్తుతం 1.12% కు చేరింది.  గత 24 గంటలలో 3,293 మంది కోవిడ్ తో చనిపోగా అందులో పది రాష్ట్రాల వాటా 78.53% ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 895 మంది చనిపోగా ఢిల్లీలో  381 మంది చనిపోయారు.

.

గత 24 గంటలలో ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, లక్షదీవులు, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్-నికోబార్ దీవులు 

 

****



(Release ID: 1714673) Visitor Counter : 236