ప్రధాన మంత్రి కార్యాలయం

భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్ కర్ జయంతి నాడు ఆయన కు నమస్సులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 14 APR 2021 8:13AM by PIB Hyderabad

భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్ కర్ జయంతి నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.

అంబేడ్ కర్ జయంతి సందర్భం లో మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్ కర్ కు ప్రధాన మంత్రి నమస్సులు అర్పిస్తూ, ‘‘సమాజం లో వంచన కు గురి అయిన వర్గాల ను ప్రధాన స్రవంతి లోకి తీసుకు రావడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్ కర్ చేసిన సంఘర్షణ రాబోయే తరాల కు ఒక ఉదాహరణ గా నిలచిపోతుంది’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***



(Release ID: 1711829) Visitor Counter : 159