ప్రధాన మంత్రి కార్యాలయం

ర‌త్న‌గిరి జిల్లాలో ఒక ఫ్యాక్ట‌రీలో జ‌రిగిన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్ర‌క‌టించిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 20 MAR 2021 3:53PM by PIB Hyderabad

ర‌త్న‌గిరి జిల్లాలోని ఒక ఫ్యాక్ట‌రీలో సంభ‌వించిన పేలుడు కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం ప్ర‌క‌టించారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఆయ‌న విచారం వ్యక్తం చేశారు.

ఇందుకు సంబంధించి ట్విట్ట‌ర్ ద్వారా ఆయ‌న ఒక సందేశ‌మిస్తూ, ర‌త్న‌గిరి జిల్లాలోని ఒక ఫ్యాక్ట‌రీలో పేలుడు కార‌ణంగా కొంద‌రు ప్రాణాలు కోల్పోయార‌ని తెలిసి బాధేసింది. మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు నా సంతాపం తెలియ‌జేస్తున్నాను. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు.

***



(Release ID: 1706341) Visitor Counter : 125