ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

గత 20 రోజులుగా భారత్ లో కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువ

అతితక్కువ కొత్త కేసులున్న దేశాల్లో, ప్రతి పది లక్షల

జనాభాలో తక్కువ మరణాలున్న దేశాల్లో భారత్ కు స్థానం

Posted On: 27 JAN 2021 11:56AM by PIB Hyderabad

భారత్ లో రోజువారీ కోలుకుంటున్నవారి సంఖ్య కొత్త కేసులకంటే ఎక్కువగా ఉంటోంది. గత 20 రోజులలో కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారు అధికంగా నమోదవుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 1,03,59,305 మంది కోవిడ్ బారి నుంచి బైటపడ్డారు.

 గత 24 గంటలలో 13,320 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి శాతం మరింత పెరిగి 96.91% అయింది.

 

రోజువారీ చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గటం చిత్రపటంలో స్పష్టంగా కనబడుతోంది. గత 24 గంటలలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య  12,689.

దేశంలో ప్రస్తుతం కోవిడ్ తో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,76,498. 

దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవారి వాటా మరింత తగ్గి ప్రస్తుతం 1.65% కు చేరింది

 

 

 గత వారంరోజులుగా దేశంలో ప్రతి పది లక్షల జనాభాలో నమోదైన కొత్త కేసులు అతి తక్కువ.  ఈ విధమైన సానుకూల ఫలితాలు స్థిరంగా కొనసాగటం వలన కేంద్రం అనుసరిస్తున్న పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు అనే వ్యూహం ఫలించినట్టయింది.

తొలిదశలోనే పెద్ద ఎత్తున దూకుడుగా వ్యాధి నిర్థారణ  పరీక్షలు జరగటం వలన బాధితులను గుర్తించి ఐసొలేషన్ లో ఉంచటమా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందించటమా అనేది  నిర్థారించి  అందుకు అనుగుణంగా నడుచుకోవటం సాధ్యమైంది.

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెరుగైన చికిత్సా వుధానాల మీద దృష్టి సారించాయి. ఐసొలేషన్ లో ఉన్నవారి మీద తగిన పర్యవేక్షణ సాగింది. తగినన్ని వెంటిలేటర్లు, పిపిఇ కిట్లు, మందులు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర అందుబాటులో ఉంచటం, సకాలంలో అంబులెన్సుల ద్వారా

బాధితులను ఆస్పత్రులకు తరలించటం  ద్వారా కేంద్రం అప్రమత్తంగా వ్యవహరించింది.

ఈ సంజీవని డిజిటల్ వేదిక ద్వారా  టెలిమెడిసిన్ సేవలు అందరికీ అందుబాటులో ఉండేట్టు చూడటం, అదే సమయంలో  కోవిడేతర వ్యాధులకు సైతం చికిత్సలో లోటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం, ఐసియు లు నిర్వహించటం సత్ఫలితాలనిచ్చాయి.

ఇందులో ఢిల్లీ లోని ఎయిమ్స్ చాలా కీలకపాత్ర పోషించింది.

జనవరి 27 ఉదయం 8 గంటల వరకు 20,29, 480 మంది లబ్ధిదారులు కోవిడ్ టీకాలు అందుకున్నారు.  గత 24 గంటలలో టీకా లబ్ధిదారుల సంఖ్య 5671 గా నమోదైంది. ఇందుకోసం 194 శిబిరాలు నిర్వహించారు. ఇప్పటివరకు నిర్వహిమ్చిన మొత్తం

 శిబిరాల సంఖ్య 36,572.  

 

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం

టీకా లబ్ధిదారులు

1

అండమాన్, నికోబార్ దీవులు

2,369

2

ఆంధ్ర ప్రదేశ్

1,56,129

3

అరుణాచల్ ప్రదేశ్

7,307

4

ఆస్సాం

19,837

5

బీహార్

88,450

6

చండీగఢ్

1,928

7

చత్తీస్ గఢ్

40,025

8

దాద్రా, నాగర్ హవేలి

345

9

డామన్, దయ్యూ

320

10

ఢిల్లీ

33,219

11

గోవా

1,796

12

గుజరాత్

91,927

13

హర్యానా

1,05,419

14

హిమాచల్ ప్రదేశ్

13,544

15

జమ్మూ కశ్మీర్

16,173

16

జార్ఖండ్

18,413

17

కర్నాటక

2,31,607

18

కేరళ

71,973

19

లద్దాఖ్

670

20

లక్షదీవులు

676

21

మధ్యప్రదేశ్

67,083

22

మహారాష్ట్ర

1,36,901

23

మణిపూర్

2,485

24

మేఘాలయ

2,748

25

మిజోరం

4,852

26

నాగాలాండ్

3,675

27

ఒడిశా

1,77,090

28

పుదుచ్చేరి

1,813

29

పంజాబ్

39,418

30

రాజస్థాన్

1,61,332

31

సిక్కిం

1,047

32

తమిళనాడు

73,953

33

తెలంగాణ

1,30,425

34

త్రిపుర

19,698

35

ఉత్తరప్రదేశ్

1,23,761

36

ఉత్తరాఖండ్

14,546

37

పశ్చిమ బెంగాల్

1,22,851

38

ఇతరములు

43,675

                                                      మొత్తం

20,29,480

 

కొత్తగా కోలుకున్నవారిలో 84.52% మంది 9 రాష్ట్రాలకు చెందినవారు కాగా కేరళలో అత్యధికంగా ఒకే రోజులో 5,290 మంది, మహారాష్ట్రలో 2,106 మంది, కర్నాటకలో 738 మంది కోలుకున్నారు.

కొత్తగా కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయినవారిలో 84.73%మంది ఏడు రాష్ట్రాలకు చెందినవారు కాగా కేరళలో అత్యధికంగా 6,293 మంది, మహారాష్ట్రలో 2,405 మంది, కర్నాటకలో 529 మంది పాజిటివ్ గా తేలారు.

 

 కొత్తగా గత 24 గంటలలో మరణించినవారిలో 83.94% మంది ఏదు రాష్ట్రాలవారు కాగా మహారాష్ట్రలో అత్యధికంగా  47 మంది, కేరళలో 19 మంది, చత్తీస్ గఢ్ లో 14 మంది చనిపోయారు.  

 

భారత దేశంలో ప్రతి పది లక్షల జనాభాలో ఒక మరణం చొప్పున మాత్రమే నమోదైంది.

 

***

 



(Release ID: 1692713) Visitor Counter : 176