ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో చికిత్సలో ఉన్నవారి సంఖ్య 1.92 లక్షలకు తగ్గుదల
ఈ ఉదయం 7 వరకు 8 లక్షలమందికి పైగా ఆరోగ్య సిబ్బందికి టీకాలు
17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి 10 లక్షల జనాభాలో కోవిడ్ కేసులు దేశ సగటు కంటే తక్కువ
Posted On:
21 JAN 2021 10:48AM by PIB Hyderabad
భారతదేశంలో చికిత్సపొందుతున్నకోవిడ్ బాధితుల సంఖ్య ఈరోజుకు 1,92,308 కు చేరింది.మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవారి వాటా ప్రస్తుతం మరింత తగ్గి 1.81% అయింది. కోలుకుంటున్నవారు పెరుగుతూ ఉండటం వలన చికిత్సలో ఉన్నవారి నికర సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత 24 గంటలలో నికరంగా 4,893 కేసుల తగ్గుదల నమోదైంది.
చికిత్సపొందుతూ ఉన్నవారు జాతీయ స్థాయిలో తగ్గుదల బాటలో సాగుతున్న తీరును ప్రతిబింబిస్తూ 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రతి పది లక్షల జనాభాలో జాతీయ సగటు కంటే తక్కువ కేసులున్నాయి. దేశంలో ప్రతి పది లక్షల జనాభాలో కేసుల సంఖ్య 7,689.
దేశంలో ఇప్పుడు చికిత్సలో ఉన్నవారిలో దాదాపు 73% మంది కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్ అనే ఐదు రాష్ట్రాలలోనే ఉన్నారు. .
2021 జనవరి 21 ఉదయం 7 గంటలకు మొత్తం 8,06,484 మంది కోవిడ్ టీకా వేయించుకున్నారు. కాగా, గత 24 గంటలలో 1,31,649 మంది 2398 శిబిరాలలో టీకాలు తీసుకున్నారు. ఇప్పటిదాకా మొత్తం 14,118 శిబిరాలు నిర్వహించారు.
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం
|
టీకాల లబ్ధిదారులు
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
644
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
91,778
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
3,023
|
4
|
అస్సాం
|
7,585
|
5
|
బీహార్
|
47,433
|
6
|
చండీగఢ్
|
469
|
7
|
చత్తీస్ గఢ్
|
16,255
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
125
|
9
|
డామన్, డయ్యూ
|
94
|
10
|
ఢిల్లీ
|
12,902
|
11
|
గోవా
|
426
|
12
|
గుజరాత్
|
21,832
|
13
|
హర్యానా
|
30,402
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
5,094
|
15
|
జమ్మూ కశ్మీర్
|
4,414
|
16
|
జార్ఖండ్
|
11,641
|
17
|
కర్నాటక
|
1,21,466
|
18
|
కేరళ
|
24,269
|
19
|
లద్దాఖ్
|
240
|
20
|
లక్షదీవులు
|
369
|
21
|
మధ్య ప్రదేశ్
|
27,770
|
22
|
మహారాష్ట్ర
|
52,055
|
23
|
మణిపూర్
|
1454
|
24
|
మేఘాలయ
|
1365
|
25
|
మిజోరం
|
1508
|
26
|
నాగాలాండ్
|
2,988
|
27
|
ఒడిశా
|
68,743
|
28
|
పుదుచ్చేరి
|
759
|
29
|
పంజాబ్
|
7,607
|
30
|
రాజస్థాన్
|
32,379
|
31
|
సిక్కిం
|
573
|
32
|
తమిళనాడు
|
33,670
|
33
|
తెలంగాణ
|
69,405
|
34
|
త్రిపుర
|
3,734
|
35
|
ఉత్తరప్రదేశ్
|
22,644
|
36
|
ఉత్తరాఖండ్
|
6,119
|
37
|
పశ్చిమ బెంగాల్
|
46,310
|
38
|
ఇతరాలు
|
26,940
|
మొత్తం
|
8,06,484
|
గడిచిన 24 గంటలలో 19,965 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోలుకున్నవారు 1,02,65,706 మంది. అంటే, కోలుకున్నవారి శాతం 96.75% గా నమోదైంది. కొత్తగా కోలుకున్నవారిలో 87.06% మంది కేవలం 10 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారున్నారు. కేరళలో అత్యధికంగా ఒక్క రోజులో 7,364 మంది కోలుకోగా మహారాష్ట్రలో 4,589 మంది కోలుకున్నారు.
కొత్తగా నిర్థారణ అయిన కేసులలో 83.84% మంది 8 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలకు చెందిన వారున్నారు. కేరళలో అత్యధికంగా 6,815 కేసులు రాగా మహారాష్టలో 3,015, చత్తీస్ గఢ్ లో 594 నమోదయ్యాయి.
గత 24 గంటలలో 151 మంది కోవిడ్ బాధితులు మరణించగా, 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 83.44% మంది మరణించారు. మహారాష్ట్రలో 59 మంది, కేరళలో 18 మంది, చత్తీస్ గఢ్ లో 10 మంది చనిపోయారు.
19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రతి 10 లక్షల జనాభాలో మరణాలు జాతీయ సగటు కంటే ఎక్కువ నమోదయ్యాయి. భారత్ లో ప్రతి పది లక్షల్లో మరణాలు 11 కాగా శాతం పరంగా 1.44%.
మరోవైపు 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రతి పది లక్షల జనాభాలో మరణాలు జాతీయ సగటు కంటే తక్కువ నమోదయ్యాయి.
****
(Release ID: 1690835)
Visitor Counter : 210