ఆర్థిక మంత్రిత్వ శాఖ

రాష్టాల మూలధన వ్యయాల ప్రత్యేక సాయం అందుకోనున్న 27 రాష్ట్రాలు

రూ. 9,879.61 కోట్ల మూలధన వ్యయాల ప్రాజెక్టులకు ఆమోదం

మొదటి వాయిదాగా రూ. 4,939.81 కోట్ల విడుదల

Posted On: 12 DEC 2020 9:08AM by PIB Hyderabad

కొత్తగా ప్రకటించిన “ రాష్టాల మూలధన వ్యయ ప్రత్యేక సహాయ పథకం“  కింద తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాలు లబ్ధి పొందాయి. ఆత్మ నిర్భర్ పాకేజ్ లో భాగంగా ఆర్థిక మంత్రి 2020 అక్టోబర్ 12న ఈ పథకాన్ని ప్రకటించారు.

ఈ ఏడాది కరోనా కారణంగా పన్ను వసూళ్ళలో కొరత ఏర్పడి తగినంత ఆర్థిక వనరులు లేని రాష్ట్ర ప్రభుత్వాలు మూలధన పెట్టుబడికి ఎక్కువ ఖర్చు చేయగఒగేలా లేవు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలు ఎక్కువ ఖర్చు చేసేలా ప్రోత్సహించటానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. మూలధన వ్యయం వలన భవిష్యత్ ఉత్పాదక సామర్థ్యం పెరగటం వలన ఆర్థికాభివృద్ధి రేటు ఎక్కువవుతుంది. అందుకే, కేంద్రం మీద ఇది అదనపు భారమైనప్పటికీ ఈ ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు అందించాలని నిర్ణయించింది.  

ఈ పథకానికి రాష్ట్రాల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటివరకు 27 రాష్ట్రాలనుంచి రూ. . 9,879.61కోట్ల మేరకు ప్రతిపాదనలు అందగా ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలియజేసింది. ఇందులో రూ. 4,939.81కోట్లను ఇప్పటికే మొదటి వాయిదా కింద విడుదలచేసింది. రాష్ట్రాలవారీ కేటాయింపులు, నిధుల విడుదల వివరాలు జతచేయబడ్డాయి.

ఆర్థిక వ్యవస్థలోని వైవిధ్య భరిత రంగాలకు మూలధన వ్యయం ఆమోదించబడింది. అందులో ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, నీటిపారుదల, విద్యుత్, రవాణా, విద్య, పట్టణాభివృద్ధి లాంటివి ఉన్నాయి. ఈ పథకంలో మూడు భాగాలున్నాయి.

 మొదటి భాగం పథకాలు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినవి. దీనికింద ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలకు (అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర) రూ. 200 కోట్లు కేటాయించారు. విస్తీర్ణం జనాభా ఎక్కువగా ఉన్నందున అస్సాం కు ప్రత్యేకంగా రూ.450 కోట్లు కేటాయించారు.

మొదటి భాగంలో లేని రాష్ట్రాలన్నీ పథకం రెండో భాగం కింద ఉన్నాయి. వీటికోసం మొత్తం 7500 కోట్లు కేటాయించారు. 2020-21 సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన మధ్యంతర అవార్డు ప్రకారం  ఆయా రాష్ట్రాల కేంద్ర పన్నుల వాటా నిష్పత్తిలో ఈ కేటాయింపు జరిగింది.

పథకం మూడో భాగం ప్రధానంగా రాష్ట్రాలలో ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేసిన సంస్కరణలకు ప్రోత్సాహం అందించేవి. దీనికోసం రూ. 2000 కోట్లు కేటాయించారు. ఆర్థిక మంత్రిత్వశాఖ 2020 మే 17న సంస్కరణలలో అనుసంధానమైన అదనపు రుణాలకోసం రాసిన లేఖలోని 4 సంస్కరణలలో కనీసం 3 చేపట్టినవారికి ఈ మొత్తం అందుబాటులో ఉంటుంది.  ఒక దేశం-ఒక రేషన్ కార్డు, వ్యాపారాన్ని సులభతరం చేసే సంస్కరణలు, పట్టణప్రాంత స్థానిక సంస్థలు/ వినియోగదారు సేవల సంస్కరణ. విద్యుత్ రంగ సంస్కరణ అనేవి కేంద్రం నిర్దేశించిన నాలుగు రకాల సంస్కరణలు. 

 

Scheme for Special Assistance to States for Capital Expenditure

(Rs. in crore)

S.No

State

Amount Allocated

Amount Approved

Amount Released

1

Andhra Pradesh

344.00

344.00

172.00

2

Arunachal Pradesh

200.00

200.00

100.00

3

Assam

450.00

450.00

225.00

4

Bihar

843.00

843.00

421.50

5

Chhattisgarh

286.00

286.00

143.00

6

Goa

32.00

32.00

16.00

7

Gujarat

285.00

285.00

142.50

8

Haryana

91.00

91.00

45.50

9

Himachal Pradesh

450.00

450.00

225.00

10

Jharkhand

277.00

277.00

138.50

11

Karnataka

305.00

305.00

152.50

12

Kerala

163.00

163.00

81.50

13

Madhya Pradesh

660.00

660.00

330.00

14

Maharashtra

514.00

514.00

257.00

15

Manipur

200.00

200.00

100.00

16

Meghalaya

200.00

200.00

100.00

17

Mizoram

200.00

200.00

100.00

18

Nagaland

200.00

200.00

100.00

19

Odisha

388.00

388.00

194.00

20

Punjab

150.00

146.50

73.25

21

Rajasthan

501.00

501.00

250.50

22

Sikkim

200.00

200.00

100.00

23

Tamil Nadu

351.00

0.00

0.00

24

Telangana

179.00

179.00

89.50

25

Tripura

200.00

200.00

100.00

26

Uttar Pradesh

1501.00

1501.00

750.50

27

Uttarakhand

450.00

434.11

217.06

28

West Bengal

630.00

630.00

315.00

 

Total

10250.00

9879.61

4939.81

 

***



(Release ID: 1680190) Visitor Counter : 196