ప్రధాన మంత్రి కార్యాలయం

బురేవి తుఫాను కారణంగా నెలకొన్న పరిస్థితులపై కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడిన - ప్రధానమంత్రి

Posted On: 02 DEC 2020 8:11PM by PIB Hyderabad

తీవ్రమైన తుఫాను బురేవి కారణంగా, కేరళ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్‌ తో మాట్లాడారు.

అనంతరం ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "కేరళ రాష్ట్రంలో పెను తుఫాను బురేవి కారణంగా సంభవించిన పరిస్థితులపై కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్‌ (@vijayanpinarayi) గారితో మాట్లాడాను. కేరళకు సహాయం చేయడానికి కేంద్రం నుండి పూర్తి మద్దతు లభిస్తుందని హామీ ఇచ్చానుదెబ్బతిన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను." అని పేర్కొన్నారు. 

*****

 



(Release ID: 1677863) Visitor Counter : 131