సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

రాజమాత విజయరాజే సింధియా గౌరవార్ధం రూ.100 స్మారక నాణేన్ని వర్చువల్‌ కార్యక్రమం ద్వారా సోమవారం విడుదల చేయనున్న ప్రధాని

Posted On: 11 OCT 2020 3:57PM by PIB Hyderabad

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, రాజమాత విజయరాజే సింధియా గౌరవార్ధం రూ.100 స్మారక నాణేన్ని వర్చువల్‌ కార్యక్రమం ద్వారా సోమవారం విడుదల చేయనున్నారు. గ్వాలియర్‌ రాజమాతగా విజయరాజే సింధియా ప్రసిద్ధులు. ఆమె జయంతి సందర్భంగా నాణెం విడుదల చేయనున్నారు. ఈ నాణేన్ని కేంద్ర ఆర్థిక శాఖ ముద్రించింది. రాజమాత సింధియా కుటుంబ సభ్యులు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు, వర్చువల్‌ వేదిక ద్వారా నాణెం విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. 



(Release ID: 1663533) Visitor Counter : 121