సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 పట్ల తగిన ప్రవర్తన కోసం జన్ ఆందోళన్ ‌ను ప్రారంభించనున్న - గౌరవ ప్రధానమంత్రి

Posted On: 07 OCT 2020 7:26PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రేపు, 2020 అక్టోబరు, 8వ తేదీన, "కోవిడ్-19 పట్ల తగిన ప్రవర్తన కోసం జన్ ఆందోళన్" పై ట్వీట్ ద్వారా ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

రాబోయే పండుగలు మరియు శీతాకాలంతో పాటు ఆర్థిక వ్యవస్థను తెరవడం దృష్ట్యా ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.  

ప్రజల భాగస్వామ్యాన్ని (జన్ ఆందోళన్) ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ప్రచారాన్ని ప్రారంభించడం జరుగుతోంది. 'మాస్కు ధరించండి, భౌతిక దూరాన్ని అనుసరించండి, చేతి పరిశుభ్రతను పాటించండి' వంటి ముఖ్య సందేశాలతో తక్కువ ఖర్చుతో, ప్రచారాన్ని ఉధృతంగా చేయడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుంది. 

అందరూ కోవిడ్-19 ప్రతిజ్ఞ తీసుకుంటారు.  ఈ  క్రింది ముఖ్యాంశాలతో,  కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు / విభాగాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్రపాలిత ప్రాంతాలచే సంఘటిత కార్యాచరణ ప్రణాళిక అమలు చేయబడుతుంది:

*          కేసుల భారం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో, ఆప్రాంతాలపై నిర్దిష్ట లక్ష్యంతో ప్రచారం జరుగుతుంది. 

*          ప్రతి పౌరునికీ చేరుకునే విధంగా సరళమైన, సులభంగా అర్థమయ్యే సందేశాలు

*          అన్ని మీడియా వేదికల ద్వారా దేశవ్యాప్తంగా ప్రచారం

*          బహిరంగ ప్రదేశాలలో బ్యానర్లు మరియు పోస్టర్లు; ఫ్రంట్ ‌లైన్ కార్మికులు మరియు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకోవడం

*          ప్రభుత్వ ప్రాంగణంలో హోర్డింగులు / గోడలపై పెయింటింగులు  / ఎలక్ట్రానిక్ ప్రదర్శన బోర్డులు

*          ఈ సందేశాన్ని ప్రతి ఇంటికీ చేరుకోడానికి వీలుగా స్థానిక మరియు జాతీయ స్థాయి ప్రముఖుల సేవలను వినియోగించుకోవడం 

*          సాధారణ అవగాహన కల్పించడం కోసం మొబైల్ వ్యాన్లను ఉపయోగించడం 

*          ఆడియో సందేశాలు; అవగాహనపై కరపత్రాలు / బ్రోచర్లు

*          కోవిడ్ సందేశాలను ప్రసారం చేయడానికి స్థానిక కేబుల్ ఆపరేటర్ల మద్దతు కోరడం

*          సమర్థవంతమైన ఔట్ రీచ్ మరియు ప్రభావం కోసం వివిధ మీడియా వేదికల మధ్య సమన్వయంతో ప్రచారం

 

***

 

 

 

 

 

 



(Release ID: 1662501) Visitor Counter : 293