రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కేంద్ర మాజీ మంత్రి, ఆర్మీ విశ్రాంత మేజర్ జస్వంత్ సింగ్ కన్నుమూత

Posted On: 27 SEP 2020 9:49AM by PIB Hyderabad

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్‌ మరణించినట్లు దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరెల్‌ ఆసుపత్రి ప్రకటించింది. ఈ ఉదయం 6.55 గంటలకు తుదిశ్వాస విడిచారని వెల్లడించింది. ఆయన సెప్సిస్‌తో బాధ పడుతూ ఆస్పత్రిలో చేరారు. మల్టీ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్‌ సిండ్రోమ్‌ కూడా తలెత్తింది. దీనికి సంబంధించి చికిత్స అందిస్తుండగా... తలకు తగిన తీవ్రమైన పాత గాయం కారణంగా ఈ ఉదయం గుండెపోటు వచ్చినట్లు ఆసుపత్రి ప్రకటించింది.

    జశ్వంత్‌ సింగ్‌ను బతికించడానికి నిపుణుల బృందం తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకపోయింది. ఆయనకు చేసిన కొవిడ్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చింది.

***
 



(Release ID: 1659521) Visitor Counter : 190