రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భార‌తీయ సైన్యంలో మ‌హిళా అధికారులకు‌ శాశ్వ‌త క‌మిష‌న్ కేటాయింపుకోసం ఏర్పాటు చేసిన సెల‌క్ష‌న్ బోర్డ్ కార్య‌క‌లాపాల ప్రారంభం

Posted On: 19 SEP 2020 11:04AM by PIB Hyderabad

భార‌తీయ సైన్య ప్ర‌ధాన కార్యాల‌యంలో స్పెష‌ల్ నెంబ‌ర్ 5 సెల‌క్ష‌న్ బోర్డ్ త‌న కార్యక‌లాపాల‌ను ప్రారంభించింది. భార‌తీయ సైన్యంలో మ‌హిళా అధికారుల‌కు శాశ్వ‌త క‌మిష‌న్ ఇవ్వ‌డంకోసం కోసం ఇది ప‌ని చేస్తుంది. ఇది సెప్టెంబ‌ర్ 14న మ‌హిళా అధికారులకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది.. ఈ బోర్డుకు సీనియ‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫీస‌ర్ నేతృత్వం వ‌హిస్తున్నారు. ఇందులో బ్రిగేడియ‌ర్ ర్యాంకు మ‌హిళా అధికారి కూడా వున్నారు. ఈ కార్య‌క‌లాపాల‌ను వీక్షించ‌డానికిగాను మ‌హిళా అధికారుల‌కు అనుమ‌తి ఇచ్చారు. పార‌ద‌ర్శ‌క‌త‌కోసం ఈ ప‌ని చేశారు. ఈ ప‌రీక్ష‌ల్లో అర్హ‌త పొందే మ‌హిళా అధికారులకు శాశ్వ‌త క‌మిష‌న్ ల‌భిస్తుంది. 

***
 



(Release ID: 1656762) Visitor Counter : 159