ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రొఫెసర్ గోవింద్ స్వరూప్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 08 SEP 2020 1:49PM by PIB Hyderabad

ప్రొఫెసర్ గోవింద్ స్వరూప్ కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

‘‘ప్రొఫెసర్ గోవింద్ స్వరూప్ ఒక అసాధారణ శాస్త్రవేత్త.  రేడియో ఖగోళ విజ్ఞాన శాస్త్రం లో ఆయన మార్గదర్శక కార్యాలకు ప్రపంచ స్థాయి లో ప్రశంసలు లభించాయి. ఆయన మరణం తో తీవ్ర దు:ఖానికి లోనయ్యాను.  ఆయన సన్నిహిత సంబంధికులకు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకుంటున్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.


***



(Release ID: 1652328) Visitor Counter : 153