రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఐపిఎస్ ప్రొబేషనర్లతో మాట్లాడనున్న ప్రధాన మంత్రి

Posted On: 03 SEP 2020 4:33PM by PIB Hyderabad

హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి (ఎస్ విపి ఎన్ పిఎ) లో జరిగే దీక్షాంత్ పరేడ్ లో భాగం గా ఐపిఎస్ ప్రొబేషనర్లతో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 4న (శుక్రవారం) ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు.

అకాడమి లో 42 వారాల పాటు సాగిన ఒకటో దశ ప్రాథమిక కోర్సు ను  131 మంది ఐపిఎస్ ప్రొబేషనర్లు  పూర్తి చేశారు.  వీరిలో 28 మంది మహిళా ప్రొబేషనర్లు ఉన్నారు.

ముస్సోరీ లోని లాల్ బహాదుర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమి, హైదరాబాద్ లోని  డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో తమ ప్రాథమిక కోర్సు ను ముగించిన తరువాత 2018 డిసెంబర్ 17న ప్రొబేషనర్లు పోలీస్ అకాడమీ లో చేరారు.  

ఎస్ విపి ఎన్ పిఎ లో బేసిక్ కోర్సు లో భాగం గా, న్యాయ శాస్త్రం, దర్యాప్తు, న్యాయ-వైద్య శాస్త్రం, నాయకత్వం, నిర్వహణ, నేర విచారణ, ప్రజా వ్యవస్థ & అంతర్గత భద్రత, నీతి శాస్త్రం, మానవ హక్కులు, ఆధునిక భారతదేశం లో పౌర రక్షణ,  వ్యూహరచన, ఆయుధ ప్రయోగ సంబంధ అంశాలలో ప్రొబేషనర్లు శిక్షణ పొందారు.


 

***



(Release ID: 1651043) Visitor Counter : 189