ప్రధాన మంత్రి కార్యాలయం

రాణి లక్ష్మి బాయి కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క కళాశాల ను మరియు పరిపాలన భవనాల ను రేపటి రోజు న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

Posted On: 28 AUG 2020 8:30PM by PIB Hyderabad

రాణి లక్ష్మి బాయి కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క కళాశాల ను మరియు పరిపాలన భవనాల ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపటి రోజు న 1230 గంటల కు రిమోట్ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు.

ఝాన్సీ లో గల ఆర్ ఎల్ బి కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం బుందేల్ ఖండ్ ప్రాంతం లో ఓ ప్రముఖ సంస్థ గా పేరు తెచ్చుకొంది.
 
ఈ విశ్వవిద్యాలయం తన ఒకటో విద్యాసంవత్సరాన్ని 2014-15 లో ఆరంభించి, వ్యవసాయం లో, ఉద్యాన శాస్త్రం లో, ఇంకా అటవీశాస్త్రం లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ను మరియు గ్రాడ్యుయేట్ కోర్సుల ను అందిస్తోంది.

ముఖ్యమైన భవనాలు సిద్ధం అవుతున్న కారణం గా ఈ విశ్వవిద్యాలయం ప్రస్తుత కార్యకలాపాల ను ఝాన్సీ లోని ఇండియన్ గ్రాస్ లాండ్ ఎండ్ ఫాడర్ రిసర్చ్ ఇన్స్ టిట్యూట్ నుండి నిర్వహిస్తోంది.

యూనివర్సిటీ కళాశాల ప్రారంభ కార్యక్రమం లో భాగం గా, విద్యార్థుల తో కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించనున్నారు.


***



(Release ID: 1649408) Visitor Counter : 132