ప్రధాన మంత్రి కార్యాలయం

పిఎం-జెడివై 6 సంవత్సరాల కాలాన్ని ఫలప్రదం గా పూర్తి చేసుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 28 AUG 2020 11:03AM by PIB Hyderabad

జన్ ధన్ యోజన కు 6 సంవత్సరాల కాలం ఫలప్రదం గా ముగిసిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.  పిఎం-జెడివై విజయవంతం అయ్యేందుకు అలుపెరగక పాటుపడ్డ వారందరిని కూడా ఆయన ప్రశంసించారు.

‘‘బ్యాంకింగ్ సదుపాయాన్ని అందుకోని వారికి బ్యాంకింగ్ సేవల ను అందించాలన్న మహత్త్వాకాంక్ష తో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ను ఆరు సంవత్సరాల క్రితం, ఈ రోజు నే, ప్రారంభించడమైంది.  ఈ కార్యక్రమం పేదరికాన్ని నిర్మూలించేటటువంటి అనేక చొరవల కు ఆధారభూతం గా నిలచి కోట్ల కొద్దీ ప్రజల కు లబ్ధి ని అందిస్తూ, అంతవరకు ఉన్న వ్యవస్థ లో ఓ మార్పు ను తీసుకువచ్చింది.  

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన సౌజన్యం తో అనేక కుటుంబాల భవిత కు భద్రత ఏర్పడింది.  ఈ పథకం లో ఎక్కువ భాగం లబ్ధిదారులు మహిళలు, ఇంకా గ్రామీణ ప్రాంతాల కు చెందినవారూను.  పిఎం-జెడివై ని ఒక సఫలమైనటువంటి కార్యక్రమం గా తీర్చిదిద్దడం కోసం అలసట ఎరుగకుండా శ్రమించిన వారందరిని కూడా ఈ సందర్భం లో ప్రశంసిస్తున్నాను’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు. 
 

***
 



(Release ID: 1649222) Visitor Counter : 193