రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

రాఫెల్‌ యుద్ధవిమానాల అప్పగింత ప్రక్రియ

Posted On: 27 JUL 2020 3:00PM by PIB Hyderabad

బుధవారం నాటికి ఐదు రాఫెల్‌ యుద్ధవిమానాలు భారత్‌ చేతికి అందనున్నాయి. ఫ్రాన్స్‌లోని డస్సాల్ట్ ఏవియేషన్‌ కేంద్రం నుంచి ఇవి ఈ ఉదయం టేకాఫ్‌ తీసుకున్నాయి. ఈ ఐదు విమానాల్లో 3 ఒకే సీటున్నవి, మిగిలిన 2 రెండు సీట్లున్నవి.

    ఈ విమాన ప్రయాణం రెండు దశల్లో సాగుతుంది. రాఫెల్‌పై సమగ్ర శిక్షణ పొందిన భారత వాయుసేన పైలెట్లే నడుపుతున్నారు. తొలిదశలో గాల్లో ఉండగానే ఇంధనం నింపుకుంటారు. ఇంధన ట్యాంకర్‌ను పంపి, ఫ్రెంచ్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఇందుకు సహకరిస్తుంది. 

    వాతావరణ పరిస్థితులను బట్టి, ఈ యుద్ధ విమానాలు బుధవారానికి అంబాలా వాయుసేన స్థావరానికి చేరుకుంటాయి. వీటిని 17వ స్వాడ్రన్‌ అయిన 'గోల్డెన్‌ యారోస్‌' బృందంలో చేరుస్తారు.



(Release ID: 1641610) Visitor Counter : 197