హోం మంత్రిత్వ శాఖ

స‌ర్దార్ ప‌టేల్ జాతీయ స‌మైక్య‌తా అవార్డు -2020 నామినేష‌న్ల‌కు గ‌డువు 2020 ఆగ‌స్టు 15 వ‌ర‌కు పెంపు

Posted On: 26 JUN 2020 4:11PM by PIB Hyderabad

దేశ స‌మైక్య‌త , స‌మ‌గ్ర‌తా రంగంలో ఇచ్చే అత్యున్న‌త పౌర పుర‌స్కారం, స‌ర్దార్ ప‌టేల్ జాతీయ స‌మైక్య‌తా అవార్డుకు ఆన్‌లైన్ ద్వారా నామినేష‌న్ల స‌మ‌ర్ఫ‌ణ‌కు గ‌డువును 2020 ఆగస్టు 15 వ‌ర‌కు పొడిగించారు. కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ ఆన్‌లైన్ ద్వారా నామినేష‌న్ల‌ను https://nationalunityawards.mha.gov.in వెబ్ సైట్ ద్వారా స్వీక‌రిస్తుంది.

భార‌త ప్ర‌భుత్వం ఈ అవార్డును స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ పేరుమీద ఏర్పాటు చేసింది. జాతీయ స‌మైక్య‌త‌, స‌మ‌గ్ర‌త‌, బ‌ల‌మైన‌, ఐక్య భార‌తావ‌నిని ప్రోత్స‌హించేందుకు,చెప్పుకోద‌గిన‌,  ప్రేర‌ణాత్మ‌క కృషి చేసిన వారిని గుర్తించి గౌర‌వించేందుకు భార‌త ప్ర‌భుత్వం ఈ అవార్డును ఏర్పాటు చేసింది.

అవార్డు చిత్రం కింద   ఇవ్వ‌బ‌డింది

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001MS4L.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002R6F9.jpg

****



(Release ID: 1634649) Visitor Counter : 248