ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కరోనా చికిత్స పొందుతున్నవారికంటే కోలుకున్నవారే 96 వేలు అధికం


58.24 చేరిన కోలుకున్నవారి శాతం

Posted On: 26 JUN 2020 3:08PM by PIB Hyderabad

భారత ప్రభుతం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు, సానుకూల చర్యలు తగిన ఫలితాలు ఇస్తున్నాయి. చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారి సంఖ్య 96,173 ఎక్కువగా ఉంది.

గడిచిన 24 గంటల్లో 13,940 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య
2,85,636కు చేరింది. దీంతో కోలుకున్నవారిశాతం 58.24% చేరింది.

ప్రస్తుతం 1,89,463 మంది ఇంకా కోవిడ్ తో బాధపడుతుండగా వారందరికీ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోది.


దేశ వ్యాప్తంగా కోవిడ్ పరీక్షల లాబ్ ల్ నెట్ వర్క్ ను విస్తృతం చేసేందుకు భారత వైద్య పరిశోధనామండలి(ఐసీఎం ఆర్ ) చర్యలు తీసుకుంటున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11 లాబ్ లు చేర్చగా ఇప్పుడు భారత్ లో మొత్తం లాబ్ ల సంఖ్య 1016 కు చేరింది. వీటిలో 737 ప్రభుత్వ లాబ్ లు, 279 ప్రయివేట్ లాబ్ లు.
ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది.

 

  • తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ : 560 (ప్రభుత్వ: 359 + ప్రైవేట్: 201)
  • ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 369 (ప్రభుత్వ: 346 + ప్రైవేట్: 23)
  • సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 87  (ప్రభుత్వ: 32  + ప్రైవేట్: 55)

​​​​​​రోజూ జరుపుతున్న పరీక్షల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో 2,15,446 పరీక్షలు జరిపారు. దీంతో ఇప్పటివరకు జరిపిన పరీక్షల సంఖ్య 77,76,228కు చేరింది.

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి.

 

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.

 

కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf చూడండి

 

******



(Release ID: 1634551) Visitor Counter : 219