హోం మంత్రిత్వ శాఖ

బిహార్‌, ఉత్తరప్రదేశ్‌లో పిడుగుల కారణంగా ప్రాణనష్టం జరగడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సంతాపం


బిహార్‌, ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు, పిడుగుల కారణంగా అమూల్యమైన ప్రాణాలు పోవడం బాధించింది: అమిత్‌ షా

బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి; గాయపడినవారు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: అమిత్‌ షా

Posted On: 26 JUN 2020 12:34PM by PIB Hyderabad

 

బిహార్‌, ఉత్తరప్రదేశ్‌లో పిడుగుల బీభత్సం కారణంగా జరిగిన భారీ సంఖ్యలో ప్రజలు చనిపోవడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సంతాపం వ్యక్తం చేశారు. "బిహార్‌, ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు, పిడుగుల కారణంగా అమూల్యమైన ప్రాణాలు పోవడం నన్ను బాధించింది" అంటూ ట్వీట్‌ చేశారు.

రెండు రాష్ట్రాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నట్లు అమిత్‌ షా చెప్పారు.

"బాధిత కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా" అని ట్వీట్‌లో అమిత్‌ షా పేర్కొన్నారు.

 

 

********

 



(Release ID: 1634505) Visitor Counter : 159