ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 తాజా సమాచారం


51.08 శాతానికి పెరిగిన కోలుకున్నవారి శాతం

ప్రస్తుతం కోవిడ్ -19 పరీక్షలకి అందుబాటులోకి వచ్చిన లాబ్ లు 900 కి పైమాటే

Posted On: 15 JUN 2020 5:38PM by PIB Hyderabad

గడిచిన 24 గంటల్లో మొత్తం 7419 మంది కోవిడ్-19  బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,69,797 కు చేరింది. బాధితులలో కోలుకున్నవారి శాతం 51.08% గా నమోదైంది. దీన్నిబట్టి వ్యాధి సోకిన వారిలో సగం మందికి పైగా కోలుకున్నారు
ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,45,779. వీరందరికీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది

కరోనా వైరస్ సోకిన వారిని పరీక్షించేందుకు పరీక్షల సామర్థ్యాన్ని భారతీయ వైద్య పరిశోధనామండలి (ఐసిఎంఆర్) పెంచుతూ వస్తోంది.  ప్రభుత్వ లేబరేటరీల సంఖ్య ఇప్పుడు  653 కి  చేరుకోగా ప్రైవేట్ లాబ్స్ సంఖ్య 248 కి పెరిగింది. దీంతో మొత్తం లాబ్స్ సంఖ్య 901 అయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:


తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ : 534 (ప్రభుత్వ: 347 + ప్రైవేట్: 187)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 296 (ప్రభుత్వ: 281 + ప్రైవేట్: 15)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 71 (ప్రభుత్వ: 25 + ప్రైవేట్: 46)
గడిచిన  24 గంటల్లో 1,15,519  శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివరకు మొత్తం పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 57,74,133 కు చేరింది.

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి.


కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  చూడండి.

****



(Release ID: 1631748) Visitor Counter : 227