శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
దేశీయ రాపిడ్ టెస్ట్ - ఆర్టి-పిసిఎస్ లను 2020 మే నాటికి ఉత్పత్తి చేయడంలో దేశం స్వావలంబన సాధిస్తుంది: డాక్టర్ హర్ష వర్ధన్
కోవిడ్ -19 నుంచి బయటపడేందుకు సత్వర పరిష్కారాలను కనుగొనాల్సిందిగా శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చిన డాక్టర్ హర్ష వర్దన్
"అర డజను మంది అభ్యర్థుల టీకాలకు మద్దతు ఇవ్వడం జరుగుతోంది, వీటిలో నాలుగు పురోగతి దశలో ఉన్నాయి." - డాక్టర్ హర్ష్ వర్ధన్
Posted On:
28 APR 2020 6:36PM by PIB Hyderabad
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆరోగ్యం,కుటుంబ సంక్షేమం , భూ విజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఈ రోజు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా బయోటెక్నాలజీ విభాగం (డిబిటి) దాని స్వయం ప్రతిపత్తిగల సంస్జలు, దాని కింద పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు బి.ఐ.ఆర్.ఎ.సి , బిబిసిఒఎల్ చేపట్టిన వివిధ కార్యక్రమాలను సమీక్షించారు. ప్రస్తుత కోవిడ్ -19 సంక్షోభాన్ని పరిష్కరించడానికి, ముఖ్యంగా టీకా తయారీ, రాపిడ్ టెస్ట్ ఆర్.టి.- పిసిఆర్ డయాగ్నొస్టిక్ కిట్ల స్వదేశీ అభివృద్ధిలో సాధించిన పురోగతికి సంబంధించి ఈ వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు.
కోవిడ్ -19ను ఎదుర్కొనేందుకు తక్షణ ప్రతిస్పందనగా అలాగే ఈ సమస్యను పరిష్కరించేందుకు దీర్ఘకాలిక సంసిద్ధత కోసం బహుముఖ పరిశోధన వ్యూహం ,కార్యాచరణ ప్రణాళికను డిబిటి రూపొందించినట్లు డిబిటి కార్యదర్శి, డాక్టర్ రేణు స్వరూప్ తెలిపారు.ఈ బహుముఖ ప్రయత్నాలలో భాగంగా కాండిడేట్ వ్యాక్సిన్లు, చికిత్సా విధానాలు కోవిడ్ -19కు సంబంధించి జంతువులపై పరిశోధనలకు తగిన నమూనాల అభివృద్ధి, పరిశోధన అలాగే హోస్ట్ వ్యాధికారకతపై స్వదేశీ విశ్లేషణలు , జన్యు అధ్యయనాల అభివృద్ధి వంటివి ఉన్నాయి.
డిబిటి, దాని పిఎస్యు అయిన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (BIRAC) డయాగ్నోస్టిక్స్, వ్యాక్సిన్లు, సరికొత్త చికిత్సా విధానాలు, డ్రగ్స్ పునర్వినియోగం లేదా కోవిడ్ -19 నియంత్రణ కోసం ఏదైనా ఇతర ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి కోవిడ్ -19 రీసెర్చ్ కన్సార్టియం పిలుపునిచ్చింది.
యాంటీవైరల్ ఔషధ అణువులను అంచనా వేయడానికి డిబిటి ల్యాబ్లు, ఎఐలు అభివృద్ధి చేస్తున్న వివిధ గణన పద్ధతుల గురించి కేంద్ర మంత్రికి వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా డిబిటి శాస్త్రవేత్తలు వివరించారు. మరొక వ్యూహంలో, వైరస్ జీవితచక్రంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్లిష్టమైన దశలను సూచించే వైరస్ సర్రోగేట్లు అభివృద్ధి చేయబడుతున్నాయి , వాటిని నిరోధించేవాటిని పరీక్షిస్తున్నారు.
కోవిడ్ -19 నుండి కోలుకున్న రోగుల నుండి లేదా మానవ యాంటీబాడీ లైబ్రరీల నుండి యాంటీబాడీలను వేరు చేసి తటస్థీకరంచే పని పురోగతిలో ఉంది. కాండిడేట్ వాక్సిన్ల అభివృద్ధికి డిబిటి వివిధ ఎఐ లు పనిచేస్తున్నాయి. ఇవి క్లినికల్ పరీక్షకు ముందు దాని కాన్సెప్ట్, రోగనిరోధక శక్తి , భద్రతా మూల్యాంకనానికి సంబంధించి రుజువు చేసే లక్ష్యంతో ప్రీ-క్లినికల్ అధ్యయనాలకు సంబంధించిన వివిధ దశలలో ఉన్నాయి. ప్రస్తుతానికి, ఈ అధ్యయనాలలో కనీసం 9 ప్రారంభ దశలో ఉన్నాయి . అభ్యర్థి వ్యాక్సిన్ ఇమ్యునోజెనిసిటీని మెరుగుపరచడానికి ఒక డెలివరీ , సహాయక వ్యవస్థ అభివృద్ధి దశలో ఉంది.
జన్యు శ్రేణి గురించి చర్చిస్తున్నప్పుడు, డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ, “ఈ జన్యు శ్రేణి ప్రయత్నాలు 26 సంవత్సరాల క్రితం పోలియో నిర్మూలన ఉద్యమాన్ని గుర్తుచేస్తాయి. పోలియో ఉద్యమం చివరి దశలో యాక్యూట్ ఫ్లాసిడ్ పెరాలిసిస్ కేసులను తెలుసుకోవడానికి దేశంలో గట్టి నిఘా పెట్టడం జరిగింది. ఆ సమయంలో కూడా, పోలియో వైరస్ ప్రయాణ చరిత్రను రుజువు చేయడానికి జన్యు శ్రేణి ఉపయోగించడం జరిగింది, ఇది చివరికి పోలియో నిర్మూలనకు సహాయపడింది” అని ఆయన అన్నారు.
డాక్టర్ హర్ష్ వర్ధన్ శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ,కోవిడ్ -19 నిరోధానికి పరిష్కారాలను కనుగొనే వారి వినూత్న మార్గాలను ప్రశంసించారు. "డిబిటి శాస్త్రవేత్తల హృదయపూర్వక ప్రయత్నాలు వచ్చే నెల చివరి నాటికి ఆర్టి-పిసిఎస్ , యాంటీబాడీ టెస్ట్ కిట్ల ఉత్పత్తిలో దేశం స్వావలంబన సాధించడానికి వీలు కల్పిస్తుంది. వచ్చే నెల చివరి నాటికి రోజుకు లక్ష పరీక్షలు చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవడం దీని ద్వారా సాధ్యమవుతుంది ”అని ఆయన అన్నారు. కొత్త టీకాలు, కొత్త మందులు వైద్య పరికరాలను అభివృద్ధి చేయటానికి కృషి చేస్తున్న శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను వేగవంతం చేయాలని మంత్రి కోరారు.
"టీకాలకు మద్దతు పొందిన కనీసం అరడజను మంది అభ్యర్థులలో, నలుగురు మంచి పురోగతి దశలో ఉన్నారు. సత్వర అనుమతుల కోసం ఒకే చోట రెగ్యులేటరీ ప్లాట్ ఫాంను ఏర్పాటు చేయడం జరిగింది " అని ఆయన చెప్పారు.
150 కి పైగా స్టార్టప్ సొల్యూషన్లకు మద్దతు ఇవ్వడంలో బిఐఆర్సి ప్రయత్నాలను మంత్రి ప్రశంసించారు, వీటిలో 20 కి పైగా వినియోగానికి సిద్ధంగా ఉన్నాయి. వివిధ జీవఔషధ ఆహార ఉత్పత్తుల తయారీలో నిమగ్నమైన డిబిటి, భారత్ ఇమ్యునోలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (బిబిసిఓఎల్) ,మరొక పిఎస్యు భారత్ ఇమ్యునోలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (BIBCOL) అభివృద్ధి చేసిన హ్యాండ్-శానిటైజర్ను ఆయన విడుదల చేశారు. వివిధ జీవ, ఔషధ ఆహార ఉత్పత్తుల తయారీలో బిఐబిసిఒఎల్ నిమగ్నమై ఉంది.
ఇది ప్రస్తుతం కోవిడ్ -19 పరిష్కారాలకు దోహదం చేయడానికి విటమిన్ సి , జింక్ టాబ్లెట్ల తయారీ ఫార్ములేషన్లను కలిగి ఉంది. "ఈ శానిటైజర్ ప్రతి బాటిల్ అమ్మకం పై ఒక రూపాయి పి.ఎం. కేర్స్కు ఫండ్ కు వెళ్తుంది" అని డాక్టర్ హర్ష్ వర్ధన్ చెప్పారు.
ఈ సమావేశంలో డిబిటి కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్, సీనియర్ అధికారులు, డిబిటి-ఎఐల డైరెక్టర్లు, సీనియర్ సైంటిస్టులు బిఐఆర్ ఎ సి, బిబిసిఓఎల్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 1619170)
Visitor Counter : 219