మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

వివిధ రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, విద్యాశాఖ కార్యదర్శులతో న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి

కోవిడ్ -19 నుండి తలెత్తే పరిస్థితుల దృష్ట్యా ఎం.డి.ఎం. పథకం కింద 8100 కోట్ల వంట ఖర్చును వార్షిక కేంద్ర కేటాయింపులో 10.99 శాతం పెంచినట్లు ప్రకటించిన శ్రీ రమేష్ ఫోఖ్రియాల్ ‘నిశాంక్’

Posted On: 28 APR 2020 6:22PM by PIB Hyderabad

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' తో మరియు సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అన్ని రాష్ట్రాల విద్యా మంత్రులు, విద్యా కార్యదర్శులతో సంభాషించారు. 22 రాష్ట్రాల విద్యా మంత్రులు, 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి అనితా కార్వాల్, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో ప్రసంగించిన కేంద్ర మంత్రి, కోవిడ్ -19 యొక్క ప్రస్తుత పరిస్థితి దురదృష్టకరమని, అయితే విద్యార్థుల భద్రత మరియు విద్యా సంక్షేమాన్ని నిర్థారించడానికి కొత్త ప్రయోగాలు చేయడం ద్వారా తెలివిగా వ్యవహరించి పరిస్థితిని అవకాశంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. నెలవారీ “మన్ కీ బాత్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ, మన ప్రధానమంత్రి కూడా నావల్ కరోనా వైరస్ కు వ్యతిరేకంగా భారతదేశం చేసిన పోరాటం ప్రజలను నడిపించిందని, ఇందులో ప్రతి పౌరుడు తన పాత్రను పోషిస్తున్నారని తెలిపారు. వ్యాపారాలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు లేదా వైద్యం రంగం అయినా, ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ అనంతర ప్రపంచంలో మార్పులకు అనుగుణంగా సిద్ధమౌతారని, ఈ వ్యాధి తదనంతర పరిస్థితులను అందరూ కలిసి ఎదుర్కోగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

33 కోట్ల మంది విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా, వారి విద్యను కొనసాగించడం కోసమే తమ ప్రయత్నమని శ్రీ ఫోఖ్రియాల్ తెలిపారు. ఇందుకోసం ఆన్ లైన్ విద్యా వేదికలైన దీక్షా,  స్వయం, స్వయంప్రభ, విద్యాదాన్ 2.0, ఈ-పాఠశాల, ఎడ్యుకేషనల్ టీవీ ఛానల్ ఆఫ్ దూరదర్శన్, డిష్ టీవీ, టాటా స్కై, జియో, ఎయిర్ టెల్ డి.టి.హెచ్. మొదలైనవి బలోపేతం చేయడానికి వివిధ ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇవే కాకుండా ప్రత్యామ్నాయ ఆకాడమిక్ క్యాలెండర్ ను కూడా ఎన్.సి.ఈ.ఆర్.టి. విడుదల చేసిందని, ఇది రాష్ట్రాల వారిగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్వీకరించవచ్చని, పాఠశాలలు తెరిచే విషయంలో భద్రతా మార్గదర్శకాలను కూడా సిద్ధం చేయాలని తెలిపారు.

విద్యార్థుల ఆరోగ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలన్న కేంద్ర మంత్రి, లాక్ డౌన్ జరిగితే పిల్లలకు తగిన మరియు పోషకమైన ఆహారాన్ని పొందడానికి మధ్యాహ్న భోజనం కింద రేషన్ అందిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు వేసవి సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజనం అందించడానికి ఆమోదం తెలిపినట్లు మంత్రి ల్యాండ్ మార్క్ నిర్ణయాన్ని ప్రకటించారు. దీని కోసం సుమారు 1600 కోట్ల అదనపు వ్యయం చేయనున్నారు. అదనంగా, మధ్యాహ్నం భోజన పథకం కింద తొలి త్రైమాసికంలో రూ.2500 కోట్ల తాత్కాలిక గ్రాంట్ జారీ చేయబడుతోంది.

కోవిడ్ -19 నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకం కింద వంట ఖర్చు (పప్పులు, కూరగాయలు, నూనె, సుగంధ ద్రవ్యాలు మరియు ఇంధనం సేకరణ కోసం) వార్షిక కేంద్ర కేటాయింపును రూ .7,300 కోట్ల నుంచి 8100 కోట్లు (10.99% పెరుగుదల) పెంచనున్నట్లు మంత్రి ప్రకటించారు.

సమగ్ర శిక్ష కింద నిబంధనలను సడలించడం ద్వారా, మునుపటి సంవత్సరంలో మిగిలిన మొత్తం రూ. 6200 కోట్లు, తాత్కాలిక మంజూరు రూ. 4450 కోట్లు కూడా జారీ చేయబడుతోంది. సమగ్రశిక్ష కింద విడుదల చేసిన మొత్తాన్ని వెంటనే రాష్ట్ర అమలు కమిటీకి బదిలీ చేయాలని మంత్రి కోరారు. తద్వారా తదుపరి విడత విడుదల వరకూ దీన్ని సక్రమంగా వినియోగించుకోవచ్చు.

షాపుల్లో పాఠ్యపుస్తకాల లభ్యత గురించి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అభ్యర్థన మేరకు, హోం మంత్రిత్వ శాఖ పుస్తక దుకాణాలను తెరవడానికి లాక్ డౌన్ నిబంధనలు సడలించిందని, తద్వారా విద్యార్థులు తమ చదువును కొనసాగించేందుకు ఎలాంటి సమస్యలు లేకుండా పుస్తకాలు పొందవచ్చని సమావేశంలో తెలిపారు.

శ్రీ ఫోఖ్రియాల్ మాట్లాడుతూ, రాష్ట్రాల్లో కేంద్రీయ విద్యాలయం మరియు నవోదయ విద్యాలయాల ఏర్పాటకు ఆమోదం లభించినప్పటికీ, భూమి లేకపోవడం వల్ల లేదా తక్కువ సామర్థ్యంతో నడుస్తున్నందున ప్రారంభించలేమని, రాష్ట్రంలో పిల్లలు దాని నుంచి ప్రయోజనం పొందేలా త్వరగా భూమిని బదిలీ చేయాలని సూచించారు.

ప్రధానంగా బోర్డు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియను ప్రారంభించాలని, ఆయా రాష్ట్రాల్లోని విద్యార్థుల జవాబు పత్రాలను మదింపు చేయడానికి సి.బి.ఎస్.ఈ.ని సులభతరం చేయాలని కేంద్ర మంత్రి అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర మంత్రులు మరియు అధికారులు విన్నవించిన అన్ని సమస్యలు మరియు సూచనలను శ్రీ ఫోఖ్రియాల్ పూర్తిగా విన్నారు. విద్యార్థుల విద్యా సంక్షేమం కోసం రాష్ట్రాలకు సాధ్యమైనంత సహాయం అందించడానికి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేసిన కృషిని రాష్ట్రాలు ప్రశంసించాయి. క్షేత్ర స్థాయిలో విద్య విషయంలో వారు చేసిన కృషికి కేంద్ర మంత్రి అన్ని రాష్ట్రాల మంత్రులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మంత్రిత్వ శాఖ తన పూర్తి సహకారాన్ని అందిస్తుందని, అందిరితో కలిసి ఈ సమస్య మీద పోరాడతామని హామీ ఇచ్చారు. 

 

--



(Release ID: 1619050) Visitor Counter : 242