ప్రధాన మంత్రి కార్యాలయం

సివిల్ సర్వీసెస్ డే నాడు ప్రభుత్వోద్యోగుల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి; సర్ దార్ పటేల్ కు శ్రద్ధాంజలి ని అర్పించిన ప్రధాన మంత్రి

Posted On: 21 APR 2020 10:42AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సివిల్ సర్వీసెస్ డే సందర్భం లో ప్రభుత్వ ఉద్యోగుల కు మరియు వారి యొక్క కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు; అంతేకాక సర్ దార్ పటేల్ కు ఆయన శ్రద్ధాంజలి ని అర్పించారు.

‘‘ఈ రోజు న, ప్రభుత్వ సేవల దినం నాడు నేను మన ప్రభుత్వోద్యోగులందరితో పాటు వారి యొక్క కుటుంబాల కు కూడా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.  భారతదేశం కొవిడ్-19 ని ఓడించడం లో సఫలం అయ్యేటట్టు పూచీ పడటానికి వారు చేస్తున్న కృషిని నేను ప్రశంసిస్తున్నాను.  వారు ఆపన్నుల కు సహాయాన్ని అందిస్తూను మరియు ప్రతి ఒక్కరు ఆరోగ్యం గా ఉండేలాగా చూడటానికిగాను రోజు లో ప్రతి గంటా శ్రమిస్తున్నారు.

మన పరిపాలన స్వరూపానికి ఆకృతి ని కల్పించిన, ప్రగతి ప్రధానమైనటువంటి మరియు దయాపూరితమైనటువంటి ఒక వ్యవస్థ కు పెద్ద పీట ను వేసిన మహనీయుడు సర్ దార్ పటేల్ కు సివిల్ సర్వీసెస్ డే నాడు ఇదే స్మృత్యంజలి’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. 

***



(Release ID: 1616640) Visitor Counter : 150