సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

పింఛను తగ్గించే ప్రతిపాదన లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం.

Posted On: 19 APR 2020 12:38PM by PIB Hyderabad

ప్రస్తుతం కోవిడ్ -19 మహమ్మారి విజృంభిస్తున్న దశలో ఆర్ధిక వ్యవస్థలో ఒడిదుడుకుల కారణంగా, పింఛను దారులకు ఏకైక ఆదాయ వనరుగా నిలిచిన పింఛన్ ను తగ్గించడం లేదా నిలిపియడం గురించి ప్రభుత్వం ఆలోచిస్తోందని పేర్కొంటూ చాలా పుకార్లు ప్రసామవుతున్నట్లు,  కేంద్ర సిబ్బంది, ప్రజా పిర్యాదులుపింఛన్ల మంత్రిత్వశాఖ కు చెందిన పింఛన్లు, పింఛన్లదారుల సంక్షేమ విభాగం దృష్టికి వచ్చింది. 

 

గతంలోనే స్పష్టం చేసిన విధంగాపింఛన్ తగ్గించే ప్రతిపాదన ఏదీ లేదని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ విషయంపై ఎటువంటి చర్య తీసుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది.  అంతే కాదు, పింఛనర్ల సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రభుత్వం కట్టుబడిఉంది. 

******


(Release ID: 1616008)